పువ్వాడ నాగేంద్ర కుమార్
(పున్నమి ఖమ్మం జిల్లా స్టాఫ్ రిపోర్టర్)
రైతు లు పడుతున్న యూరియా సమస్య మీద భారతీయ కిసాన్ సంఘ్ తెలంగాణ రాష్ట్ర నాయకులు మందనపు రామారావ్ ని కలిసిన పున్నమి ప్రతి నిధి తో మాట్లాడుతూ..
యూరియాని బ్లాక్ మార్కెట్ కు తరలించారు అన్నది స్పష్టంగా అర్థమవుతుంది.. ఈరోజు రాష్ట్రంలో యూరియా కొరతతో రైతులు తీవ్రమైన ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది.. రైతుల ఇబ్బందిని రాష్ట్ర ప్రభుత్వం కనీసం గా కూడా పట్టించుకోకపోవడం దురదృష్టకరం. సబ్సిడీ యూరియా పెద్ద ఎత్తున బ్లాక్ మార్కెట్ కు తరలిపొయి రైతులకు అందక హరిగోశ పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి దీనిపై తక్షణమే విచారణ జరిపించాలి.. ఏది ఏమైనా మరింత యూరియాని రైతులకు అందుబాటులో ఉంచాల్సిన అవసరం ఉందిఅని రామారావ్ అన్నారు.


