పున్నమి ప్రతి నిధి
ఖమ్మం
*రైతుల యూరియా కష్టాలను చూపిస్తే మీడియా పై కేసులు పెడతారా అని BRS రాష్ట్ర నాయకులు మాజీ శాసన సభ్యులు సండ్ర వెంకట్ వీరయ్య ప్రభుత్వం ని ప్రశ్నించారు.
*అణిచివేతలు, ఆంక్షలతో జర్నలిస్టులను భయపెడుతారా?*- *ఎమ్మెల్సీ & ఖమ్మం జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తాతా మధుసూదన్ మరియు సత్తుపల్లి మాజీ శాసనసభ్యులు సండ్ర వెంకటవీరయ్య*
రైతులు పడుతున్న యూరియా కష్టాలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేందుకు ప్రయత్నించిన మీడియా మీద పోలీసులు అక్రమ కేసులు బనాయించడం దుర్మార్గం. రైతుల సమస్యలను తెలుసుకునేందుకు వెళ్లిన జర్నలిస్టుపై పోలీసులు ఉల్టా కేసులు పెట్టడం రాష్ట్ర ప్రభుత్వ నిరంకుశ పాలనకు నిదర్శనం.
గడిచిన 2 నెలలుగా రైతులు యూరియా కోసం అష్టకష్టాలు పడుతుంటే పట్టించుకోని ప్రభుత్వం. ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎత్తి చూపుతున్న మీడియా ప్రతినిధులపై కేసులు పెట్టడం శోచనీయం. శాంతిభద్రతల నిర్వహణను పక్కన పెట్టి ప్రజల గొంతునొక్కేందుకు పోలీసులను వాడడం అప్రజాస్వామీకం.
జర్నలిస్ట్ ల పై పెట్టిన కేసులను తక్షణం ఉపసంహరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, డీజీపీని వారు డిమాండ్ చేస్తూ.. MLC &
ఖమ్మం జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు *
తాతా మధుసూదన్ మరియు సత్తుపల్లి మాజీ శాసనసభ్యులు *సండ్ర వెంకటవీరయ్య ప్రకటన విడుదల చేశారు.


