Monday, 6 April 2026
  • Home  
  • యువతలో చైతన్యం కోసం సైకిల్ యాత్ర… పోలీసుల సహకారంతో ర్యాలీ
- తిరుపతి

యువతలో చైతన్యం కోసం సైకిల్ యాత్ర… పోలీసుల సహకారంతో ర్యాలీ

యువతలో డ్రగ్స్ వ్యతిరేక అవగాహన కల్పించేందుకు తిరుపతి నుంచి విశాఖపట్నం వరకు ఏప్రిల్ 6 నుండి 22 వరకు నిర్వహిస్తున్న మహా సైకిల్ యాత్ర శుక్రవారం శ్రీకాళహస్తి పట్టణానికి చేరుకుంది. VIBRANTS KALAM ఆధ్వర్యంలో ప్రారంభమైన ఈ యాత్రకు స్థానికంగా విశేష స్పందన లభించింది. శ్రీకాళహస్తి పోలీస్ శాఖ ఆదేశాల మేరకు, పట్టణంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించగా, సాయంత్రం 4 నుంచి 5 గంటల మధ్య ఏపీ టూరిజం కేంద్రం నుంచి పొన్నాలమ్మ గుడి వరకు సైకిల్ ర్యాలీ విజయవంతంగా జరిగింది. ఈ సందర్భంగా AISF తిరుపతి జిల్లా సహాయక కార్యదర్శి కొగిలి మునిచందు మాట్లాడుతూ, “డ్రగ్స్ కారణంగా విద్యార్థుల భవిష్యత్తు నాశనం అవుతోంది. అందుకే ఇలాంటి యాత్రల ద్వారా ప్రజల్లో అవగాహన కల్పించడం అత్యంత అవసరం” అని తెలిపారు. ఈ యాత్ర ముఖ్య ఉద్దేశ్యం మాదకద్రవ్యాలకు “NO” చెప్పడం, ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణం, యువతను సరైన దారిలో నడిపించడం అని నిర్వాహకులు పేర్కొన్నారు. రాష్ట్రంలో డ్రగ్స్ కారణంగా అనేక మంది విద్యార్థులు తమ భవిష్యత్తును కోల్పోతున్న నేపథ్యంలో, విద్యార్థి సంఘాలు, ప్రజాసంఘాలు కలిసి నిర్మూలన కోసం చర్యలు చేపడుతున్నాయని తెలిపారు. వతరం ముందుకు వచ్చి డ్రగ్స్ నిర్మూలన కోసం కలిసికట్టుగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ యాత్రకు మద్దతుగా ప్రజలు సైకిళ్లతో పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా వన్ టౌన్ సిఐ ప్రకాశ్ కుమార్, టూ టౌన్ సిఐ నాగరాజు, పోలీస్ సిబ్బంది, ఏఐఎస్ఎఫ్ నాయకులు, విద్యార్థులు మరియు స్థానికులు పాల్గొన్నారు.

యువతలో డ్రగ్స్ వ్యతిరేక అవగాహన కల్పించేందుకు తిరుపతి నుంచి విశాఖపట్నం వరకు ఏప్రిల్ 6 నుండి 22 వరకు నిర్వహిస్తున్న మహా సైకిల్ యాత్ర శుక్రవారం శ్రీకాళహస్తి పట్టణానికి చేరుకుంది. VIBRANTS KALAM ఆధ్వర్యంలో ప్రారంభమైన ఈ యాత్రకు స్థానికంగా విశేష స్పందన లభించింది. శ్రీకాళహస్తి పోలీస్ శాఖ ఆదేశాల మేరకు, పట్టణంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించగా, సాయంత్రం 4 నుంచి 5 గంటల మధ్య ఏపీ టూరిజం కేంద్రం నుంచి పొన్నాలమ్మ గుడి వరకు సైకిల్ ర్యాలీ విజయవంతంగా జరిగింది. ఈ సందర్భంగా AISF తిరుపతి జిల్లా సహాయక కార్యదర్శి కొగిలి మునిచందు మాట్లాడుతూ, “డ్రగ్స్ కారణంగా విద్యార్థుల భవిష్యత్తు నాశనం అవుతోంది. అందుకే ఇలాంటి యాత్రల ద్వారా ప్రజల్లో అవగాహన కల్పించడం అత్యంత అవసరం” అని తెలిపారు. ఈ యాత్ర ముఖ్య ఉద్దేశ్యం మాదకద్రవ్యాలకు “NO” చెప్పడం, ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణం, యువతను సరైన దారిలో నడిపించడం అని నిర్వాహకులు పేర్కొన్నారు. రాష్ట్రంలో డ్రగ్స్ కారణంగా అనేక మంది విద్యార్థులు తమ భవిష్యత్తును కోల్పోతున్న నేపథ్యంలో, విద్యార్థి సంఘాలు, ప్రజాసంఘాలు కలిసి నిర్మూలన కోసం చర్యలు చేపడుతున్నాయని తెలిపారు. వతరం ముందుకు వచ్చి డ్రగ్స్ నిర్మూలన కోసం కలిసికట్టుగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ యాత్రకు మద్దతుగా ప్రజలు సైకిళ్లతో పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా వన్ టౌన్ సిఐ ప్రకాశ్ కుమార్, టూ టౌన్ సిఐ నాగరాజు, పోలీస్ సిబ్బంది, ఏఐఎస్ఎఫ్ నాయకులు, విద్యార్థులు మరియు స్థానికులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.