ముస్తాబాద్/పున్నమి ప్రతినిధి జనవరి 23
ఈరోజు ముస్తాబాద్ మండల కేంద్రంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నేతాజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఎల్ల బాల్రెడ్డి, పోతుగల్ గ్రామ సర్పంచ్ పెద్ది గారి యాదమ్మ శ్రీనివాస్, మాజీ సర్పంచ్ ఓరగంటి తిరుపతి, గజ్జల రాజు తదితరులు పాల్గొన్నారు. నేతాజీ దేశభక్తి, త్యాగాలు యువతకు ఆదర్శమని మరియు దేశ యువతను ఐకమత్యంగా ఉంచడంతోపాటు ఐఎన్ఎ స్థాపించి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా తన సైన్యాన్ని నడిపించిన గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడు జయంతి ఉండి వర్ధంతి లేని గొప్ప నాయకుడని ఈ సందర్భంగా వారు సుభాష్ చంద్ర బోస్ గారిని పలు విధాలుగా ఆయన త్యాగాలను కొనియాడారు.


