Friday, 27 March 2026
  • Home  
  • మారుతున్న వాతావరణానికి అనుగుణంగా సాగు పద్ధతులపై ముచ్చువోలు రైతులకు శిక్షణ
- తిరుపతి

మారుతున్న వాతావరణానికి అనుగుణంగా సాగు పద్ధతులపై ముచ్చువోలు రైతులకు శిక్షణ

శ్రీకాళహస్తి, మార్చి 25 (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తి మండలంలోని ముచ్చువోలు గ్రామంలో జిల్లా వనరుల కేంద్రం, తిరుపతి ఆధ్వర్యంలో రైతులకు మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా సాగు పద్ధతులపై అవగాహన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం రైతులకు ఆధునిక వ్యవసాయంపై కీలకమైన మార్గదర్శకంగా నిలిచింది. ఈ సందర్భంగా జిల్లా వనరుల కేంద్రం సహాయ వ్యవసాయ సంచాలకులు శ్రీమతి సౌభాగ్య లక్ష్మి మాట్లాడుతూ, మారుతున్న వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని సరైన పంటల ఎంపిక, భూసార పరీక్షల ప్రాముఖ్యత, భూమి ఆరోగ్యం పరిరక్షణపై వివరించారు. అలాగే సేంద్రియ ఎరువుల వినియోగం పెంచి, రసాయన ఎరువుల అధిక వినియోగం వల్ల కలిగే నష్టాలను రైతులకు వివరించారు. శ్రీకాళహస్తి మండల వ్యవసాయ అధికారి మమత రెడ్డి మాట్లాడుతూ, భూసార పరీక్షల ఆధారంగా ఎరువుల వినియోగం చేయడం, ఆధునిక వ్యవసాయ యంత్ర పరికరాల వినియోగం, డ్రోన్ సాంకేతికత ఉపయోగం, అలాగే ‘రైతన్న మీకోసం’ వంటి ప్రభుత్వ కార్యక్రమాల ప్రాముఖ్యతను వివరించారు. జిల్లా వనరుల కేంద్రం వ్యవసాయ అధికారి వేణుగోపాల్ మాట్లాడుతూ, వాతావరణ మార్పులకు అనుగుణంగా సరైన విత్తన రకాల ఎంపిక, సేంద్రియ ఎరువుల వినియోగం పెంచడం ద్వారా వర్షాభావం లేదా అధిక వర్షపాతం పరిస్థితుల్లో కూడా పంటలు నిలదొక్కుకునే అవకాశాలు పెరుగుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వనరుల కేంద్రం వ్యవసాయ విస్తరణ అధికారి రవి ప్రసాద్, రైతు సేవ కేంద్రం వ్యవసాయ సహాయకురాలు విజయలక్ష్మి, ప్రకృతి వ్యవసాయ సమన్వయకర్త ప్రసాద్, ప్రకృతి వ్యవసాయ వనరుల కేంద్రం ప్రతినిధులు, సిబ్బంది మరియు పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.

శ్రీకాళహస్తి, మార్చి 25 (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తి మండలంలోని ముచ్చువోలు గ్రామంలో జిల్లా వనరుల కేంద్రం, తిరుపతి ఆధ్వర్యంలో రైతులకు మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా సాగు పద్ధతులపై అవగాహన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం రైతులకు ఆధునిక వ్యవసాయంపై కీలకమైన మార్గదర్శకంగా నిలిచింది. ఈ సందర్భంగా జిల్లా వనరుల కేంద్రం సహాయ వ్యవసాయ సంచాలకులు శ్రీమతి సౌభాగ్య లక్ష్మి మాట్లాడుతూ, మారుతున్న వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని సరైన పంటల ఎంపిక, భూసార పరీక్షల ప్రాముఖ్యత, భూమి ఆరోగ్యం పరిరక్షణపై వివరించారు. అలాగే సేంద్రియ ఎరువుల వినియోగం పెంచి, రసాయన ఎరువుల అధిక వినియోగం వల్ల కలిగే నష్టాలను రైతులకు వివరించారు. శ్రీకాళహస్తి మండల వ్యవసాయ అధికారి మమత రెడ్డి మాట్లాడుతూ, భూసార పరీక్షల ఆధారంగా ఎరువుల వినియోగం చేయడం, ఆధునిక వ్యవసాయ యంత్ర పరికరాల వినియోగం, డ్రోన్ సాంకేతికత ఉపయోగం, అలాగే ‘రైతన్న మీకోసం’ వంటి ప్రభుత్వ కార్యక్రమాల ప్రాముఖ్యతను వివరించారు. జిల్లా వనరుల కేంద్రం వ్యవసాయ అధికారి వేణుగోపాల్ మాట్లాడుతూ, వాతావరణ మార్పులకు అనుగుణంగా సరైన విత్తన రకాల ఎంపిక, సేంద్రియ ఎరువుల వినియోగం పెంచడం ద్వారా వర్షాభావం లేదా అధిక వర్షపాతం పరిస్థితుల్లో కూడా పంటలు నిలదొక్కుకునే అవకాశాలు పెరుగుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వనరుల కేంద్రం వ్యవసాయ విస్తరణ అధికారి రవి ప్రసాద్, రైతు సేవ కేంద్రం వ్యవసాయ సహాయకురాలు విజయలక్ష్మి, ప్రకృతి వ్యవసాయ సమన్వయకర్త ప్రసాద్, ప్రకృతి వ్యవసాయ వనరుల కేంద్రం ప్రతినిధులు, సిబ్బంది మరియు పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.