శ్రీకాళహస్తి పున్నమి టెంపుల్ న్యూస్, ఫిబ్రవరి 14: శ్రీకాళహస్తి క్షేత్రంలో భక్తుల సౌకర్యార్థం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘శివం టు శివం’ లింక్ రోడ్డును రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డితో స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి కలిసి శనివారం ఘనంగా ప్రారంభించారు. సుమారు 20 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ రోడ్డు మార్గం, క్షేత్రానికి వచ్చే భక్తుల రద్దీని తగ్గించడంలో కీలక పాత్ర పోషించనుంది. ఈ సందర్భంగా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ.. శ్రీకాళహస్తిని అంతర్జాతీయ స్థాయిలో ఆధ్యాత్మిక మరియు పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ, ‘విజన్-2029’ (Vision-2029) ప్రణాళికలో భాగంగా నియోజకవర్గంలో మరిన్ని అభివృద్ధి పనులు చేపడతామని హామీ ఇచ్చారు. అనంతరం శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ.. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల వేళ పట్టణంలో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ఈ రోడ్డు మార్గాన్ని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేశారని రోడ్డు ద్వారా భక్తులు పట్టణంలోకి రాకుండానే నేరుగా బైపాస్ రోడ్డుకు చేరుకోవచ్చన్నారు. శ్రీకాళహస్తిని అంతర్జాతీయ ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన పునరుద్ఘాటిస్తు గత ప్రభుత్వంలో ఈ రోడ్డు నిర్మాణానికి 42.5కోట్లు ఎస్టిమేట్ వేయగా తమ కూటమి ప్రభుత్వంలో ఈ రోడ్డు నిర్మాణం 20 కోట్ల రూపాయల వ్యయంతో పూర్తి చేస్తున్నామని గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్న వ్యత్యాసం ఇదేనని ఈ సందర్భంగా ఆయన అన్నారు.. 40.5 కోట్ల రూపాయలు వ్యయంతో అప్పటి వైకాప ప్రభుత్వం ఈ రహదారి ఏర్పాటు చేయదలిస్తే, తమ ప్రభుత్వం 20 కోట్ల రూపాయలతో ఈ రోడ్డు నిర్మాణం చేపట్టడం చూస్తే గత ప్రభుత్వం ఏవిధంగా ప్రజల సొమ్మును స్వాహా చేశారో అర్ధమవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, ఎస్పి సుబ్బారాయుడు, ఆర్డిఓ భాను ప్రకాష్ రెడ్డి,ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ కొట్టేసాయి ప్రసాద్, బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్ కుమార్, టిడిపి పట్టణ అధ్యక్షులు విజయకుమార్ నాయుడు,తొట్టంబేలు టిడిపి అధ్యక్షులు రావిళ్ళ మునిరాజ నాయుడు, ట్రస్టు బోర్డు సభ్యులు, దేవస్థానం కార్యనిర్వాహణ అధికారి టి.బాపిరెడ్డి, ఆలయ అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

బ్రహ్మోత్సవ కానుక శివం టు శివం రోడ్డు మార్గం- దేవాదాయ శాఖ మంత్రి
శ్రీకాళహస్తి పున్నమి టెంపుల్ న్యూస్, ఫిబ్రవరి 14: శ్రీకాళహస్తి క్షేత్రంలో భక్తుల సౌకర్యార్థం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘శివం టు శివం’ లింక్ రోడ్డును రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డితో స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి కలిసి శనివారం ఘనంగా ప్రారంభించారు. సుమారు 20 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ రోడ్డు మార్గం, క్షేత్రానికి వచ్చే భక్తుల రద్దీని తగ్గించడంలో కీలక పాత్ర పోషించనుంది. ఈ సందర్భంగా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ.. శ్రీకాళహస్తిని అంతర్జాతీయ స్థాయిలో ఆధ్యాత్మిక మరియు పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ, ‘విజన్-2029’ (Vision-2029) ప్రణాళికలో భాగంగా నియోజకవర్గంలో మరిన్ని అభివృద్ధి పనులు చేపడతామని హామీ ఇచ్చారు. అనంతరం శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ.. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల వేళ పట్టణంలో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ఈ రోడ్డు మార్గాన్ని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేశారని రోడ్డు ద్వారా భక్తులు పట్టణంలోకి రాకుండానే నేరుగా బైపాస్ రోడ్డుకు చేరుకోవచ్చన్నారు. శ్రీకాళహస్తిని అంతర్జాతీయ ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన పునరుద్ఘాటిస్తు గత ప్రభుత్వంలో ఈ రోడ్డు నిర్మాణానికి 42.5కోట్లు ఎస్టిమేట్ వేయగా తమ కూటమి ప్రభుత్వంలో ఈ రోడ్డు నిర్మాణం 20 కోట్ల రూపాయల వ్యయంతో పూర్తి చేస్తున్నామని గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్న వ్యత్యాసం ఇదేనని ఈ సందర్భంగా ఆయన అన్నారు.. 40.5 కోట్ల రూపాయలు వ్యయంతో అప్పటి వైకాప ప్రభుత్వం ఈ రహదారి ఏర్పాటు చేయదలిస్తే, తమ ప్రభుత్వం 20 కోట్ల రూపాయలతో ఈ రోడ్డు నిర్మాణం చేపట్టడం చూస్తే గత ప్రభుత్వం ఏవిధంగా ప్రజల సొమ్మును స్వాహా చేశారో అర్ధమవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, ఎస్పి సుబ్బారాయుడు, ఆర్డిఓ భాను ప్రకాష్ రెడ్డి,ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ కొట్టేసాయి ప్రసాద్, బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్ కుమార్, టిడిపి పట్టణ అధ్యక్షులు విజయకుమార్ నాయుడు,తొట్టంబేలు టిడిపి అధ్యక్షులు రావిళ్ళ మునిరాజ నాయుడు, ట్రస్టు బోర్డు సభ్యులు, దేవస్థానం కార్యనిర్వాహణ అధికారి టి.బాపిరెడ్డి, ఆలయ అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

