

శ్రీకాకుళం జిల్లా, నరసన్నపేట మండలానికి చెందిన క్రీడాకారులు బొమ్మాలి కగేశ్వరరావు మరియు సూరపు సురేష్ క్రీడలలో ప్రతిభ చూపుతూ పిల్లలకు కూడా శిక్షణనిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.ఇటీవల పంజాబ్ రాష్ట్రానికి ప్రత్యేకమైన ‘గట్కా’ ఆటకు ఆంధ్రప్రదేశ్లో విజయవాడలో రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహించారు. ఈ పోటీలలో 11 జిల్లాల నుంచి క్రీడాకారులు పాల్గొన్నారు.ఈ పోటీలలో శ్రీకాకుళం జిల్లా క్రీడాకారులు అద్భుత ప్రతిభ కనబరచి రెండో స్థానం సాధించారు. మొత్తం 8 గోల్డ్ మెడల్స్, 17 సిల్వర్ మెడల్స్, 3 బ్రాంజ్ మెడల్స్ గెలుచుకొని జిల్లాకు గౌరవాన్ని తీసుకువచ్చారు.ఈ విజయానికి శిక్షణనిచ్చిన కగేశ్వరరావు, సురేష్లను పలువురు అభినందిస్తూ ఆదర్శప్రాయులుగా ప్రశంసిస్తున్నారు.

