Sunday, 5 April 2026
  • Home  
  • బొజ్జల సుధీర్ రెడ్డి ఆదేశాల మేరకు.. టిడిపి కార్యాలయంలో జగ్జీవన్ రామ్ స్మరణ
- తిరుపతి

బొజ్జల సుధీర్ రెడ్డి ఆదేశాల మేరకు.. టిడిపి కార్యాలయంలో జగ్జీవన్ రామ్ స్మరణ

శ్రీకాళహస్తి, ఏప్రిల్ 05 (పున్నమి న్యూస్): భారత మాజీ ఉప ప్రధాని, అణగారిన వర్గాల ఆశాజ్యోతి బాబూ జగ్జీవన్ రామ్ 117వ జయంతి వేడుకలు శ్రీకాళహస్తి పట్టణ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో అత్యంత ఘనంగా జరిగాయి. స్థానిక శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఆదేశాల మేరకు, పట్టణ టిడిపి అధ్యక్షులు గేడిపూడి విజయ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. నాయకులు, కార్యకర్తలు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా గేడిపూడి విజయ్ మాట్లాడుతూ.. బాబూజీగా ప్రసిద్ధి చెందిన జగ్జీవన్ రామ్ గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడు, అలుపెరగని సంఘ సంస్కర్త అని కొనియాడారు. బీహార్‌లోని వెనుకబడిన వర్గం నుండి వచ్చి, 40 ఏళ్ల పాటు పార్లమెంటులో వివిధ కీలక మంత్రి పదవులు చేపట్టి, దేశ ఉప ప్రధానిగా ఎదిగిన ఆయన జీవితం అందరికీ స్ఫూర్తిదాయకమన్నారు. సామాజిక సమానత్వం కోసం ఆయన చేసిన కృషిని ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థాన బోర్డు సభ్యులు గాదిపాకుల గోపీనాథ్, గుర్రప్ప శెట్టి, కంట రమేష్, కాస్రం రమేష్ పాల్గొన్నారు. అలాగే 19వ వార్డు అధ్యక్షులు జి. మధు, పట్టణ సెక్రటరీ మున్నంగి కార్తీక్, చింత వెంకట్, దావల రాజేష్, టౌన్ బ్యాంక్ చైర్మన్, సభ్యులు, వెంకటసుబ్బయ్య, మైనార్టీ విభాగం పెద్దలు, టిడిపి మహిళా నాయకురాళ్లు మరియు భారీ సంఖ్యలో కార్యకర్తలు పాల్గొని నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు ఎస్. సురేష్, వైస్ ప్రెసిడెంట్ ఎస్. దివాకర్, సెక్రటరీ పి. కుమార్, జనరల్ సెక్రటరీ ఎం. గురవయ్య, జాయింట్ సెక్రటరీ జి. రమణయ్య, సహాయ వైస్ ప్రెసిడెంట్ పి. గురునాథం, సలహా కమిటీ సభ్యులు పి. బాలాజీ, ట్రెజరీ మరియు సోషల్ మీడియా కార్యదర్శి రమేష్ తదితరులు పాల్గొన్నారు.

శ్రీకాళహస్తి, ఏప్రిల్ 05 (పున్నమి న్యూస్): భారత మాజీ ఉప ప్రధాని, అణగారిన వర్గాల ఆశాజ్యోతి బాబూ జగ్జీవన్ రామ్ 117వ జయంతి వేడుకలు శ్రీకాళహస్తి పట్టణ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో అత్యంత ఘనంగా జరిగాయి. స్థానిక శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఆదేశాల మేరకు, పట్టణ టిడిపి అధ్యక్షులు గేడిపూడి విజయ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. నాయకులు, కార్యకర్తలు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా గేడిపూడి విజయ్ మాట్లాడుతూ.. బాబూజీగా ప్రసిద్ధి చెందిన జగ్జీవన్ రామ్ గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడు, అలుపెరగని సంఘ సంస్కర్త అని కొనియాడారు. బీహార్‌లోని వెనుకబడిన వర్గం నుండి వచ్చి, 40 ఏళ్ల పాటు పార్లమెంటులో వివిధ కీలక మంత్రి పదవులు చేపట్టి, దేశ ఉప ప్రధానిగా ఎదిగిన ఆయన జీవితం అందరికీ స్ఫూర్తిదాయకమన్నారు. సామాజిక సమానత్వం కోసం ఆయన చేసిన కృషిని ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థాన బోర్డు సభ్యులు గాదిపాకుల గోపీనాథ్, గుర్రప్ప శెట్టి, కంట రమేష్, కాస్రం రమేష్ పాల్గొన్నారు. అలాగే 19వ వార్డు అధ్యక్షులు జి. మధు, పట్టణ సెక్రటరీ మున్నంగి కార్తీక్, చింత వెంకట్, దావల రాజేష్, టౌన్ బ్యాంక్ చైర్మన్, సభ్యులు, వెంకటసుబ్బయ్య, మైనార్టీ విభాగం పెద్దలు, టిడిపి మహిళా నాయకురాళ్లు మరియు భారీ సంఖ్యలో కార్యకర్తలు పాల్గొని నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు ఎస్. సురేష్, వైస్ ప్రెసిడెంట్ ఎస్. దివాకర్, సెక్రటరీ పి. కుమార్, జనరల్ సెక్రటరీ ఎం. గురవయ్య, జాయింట్ సెక్రటరీ జి. రమణయ్య, సహాయ వైస్ ప్రెసిడెంట్ పి. గురునాథం, సలహా కమిటీ సభ్యులు పి. బాలాజీ, ట్రెజరీ మరియు సోషల్ మీడియా కార్యదర్శి రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.