సెప్టెంబర్ , పున్నమి ప్రతినిధి
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ “ఓజీ” సినిమా విడుదలకు ముందు భారీ క్రేజ్ సృష్టిస్తోంది. ఫస్ట్ డే టిక్కెట్లను వేలం వేసి అభిమానులు జనసేన పార్టీకి విరాళాలు అందిస్తున్నారు. బెంగళూరు అభిమానులు రూ. 3.61 లక్షలు, చెన్నై నుండి 1.72 లక్షలు, చిత్తూరు నుంచి 1 లక్ష చొప్పున విరాళాలు అందజేశారు. విరాళాలను ఎమ్మెల్సీ నాగబాబు స్వీకరించి అభిమానుల నిబద్ధతను ప్రశంసించారు. అభిమానులు తమ నటుడి సినిమాను రాజకీయ మద్దతుగా కూడా ఉపయోగిస్తున్నారు. సుజీత్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో ప్రియాంక అరుళ్ మోహన్ కథానాయిక, ఇమ్రాన్ హష్మీ విలన్ పాత్రలో, శ్రియా రెడ్డి కీలక పాత్రలో నటించారు. సినిమా సెప్టెంబర్ 25న రిలీజ్ అవుతుంది.


