ఖమ్మం పున్నమి ప్రతినిధి
👉🏽ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి అమ్మని తిట్టడం నీ తీవ్రంగా ఖండిస్తున్నాం
👉🏽రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలి
భద్రాద్రి కొత్తగూడెం దమ్మపేటలో బీజేపీ నాయకుల ముందస్తు అరెస్టులను ఖండిస్తున్నాం. అని బీజేపీ దమ్మపేట మండల అధ్యక్షులు పల్లపు వెంకటేశ్వారావ్ అన్నారు.
అయన మాట్లాడుతూ తల్లి ఎవరికైనా తల్లి అని,ఒక ఆడ తల్లిని తిడితే ఊరుకునే ప్రసక్తే లేదు,బీహార్ రాష్ట్రంలో జరగబోయే ఎలక్షన్లలో బిహార్ ఓటర్ల జాబితాపై కాంగ్రెస్ వాళ్ళు ఓటరు జాబితాలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తున్నారు,మరి రాహుల్ గాంధీ,ప్రియాంక గాంధీ ఓట్ల ద్వారా గెలవలేదా అని బీజేపీ ఆరోపించింది,దీనిపై కాంగ్రెస్ నాయకులు ప్రధానమంత్రి మోడీ మాతృ మూర్తి నివిమర్శిస్తూ నోటి కి వచ్చిన విధంగా పచ్చి బూతులు తిడుతూ మాట్లాడటం జరిగింది,దీనిపై బీజేపీ నాయకుల స్పందించి దమ్మపేటలో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దగ్ధం చేయాలి అని ప్రయత్నిస్తుండగా పోలీసులు రంగ ప్రవేశం చేసి బిజెపి నాయకుల్ని ముందస్తు అరెస్ట్ చేయడం జరిగింది,ముందస్తు అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు,ఈ కార్యక్రమంలో బిజెపి మండల నాయకులు పాల్గొన్నారు.

