శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, ఫిబ్రవరి 12: శ్రీకాళహస్తి పట్టణంలో అంబేద్కర్ బాలికల గురుకుల పాఠశాలలో ప్రగతి సంస్థ, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో బాల్య వివాహాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రగతి సంస్థ డైరెక్టర్ కెవి రమణ మాట్లాడుతూ….మహా శివరాత్రి సందర్భంగా శ్రీకాళహస్తిలో దేవుడి పెళ్లి రోజున ప్రతి యేటా సామూహిక వివాహాలు నిర్వహించడం ఆనవాయితీ. ఆది దంపతులకు పెళ్లి జరిపే రోజు వివాహాలు జరిగితే ఆ జంటలు కలకాలం ఆనందంగా, అన్యోన్యంగా ఉంటాయని ప్రజల విశ్వాసం. కానీ ఈ పర్వదినాన బాల్య వివాహాలు చోటు చేసుకోవడం తీవ్ర ఆవేదనకు గురి చేస్తోంది. మన నమ్మకాలకు, విశ్వాసాలకు అమూల్యమైన బాల్యాన్ని బలి ఇవ్వడం (బాల్య వివాహాలు చేయడం) చట్ట రీత్యా నేరం. బాల్య వివాహలకు పాల్పడితే కుటుంబ సభ్యులు, బంధువులు, పూజారి మొదలు క్యాటరింగ్ చేసిన వారి వరకు ప్రతి ఒక్కరూ శిక్షార్హులే. 2009 నుంచి మాస్ మ్యారేజెస్ సందర్భంగా బాల్య వివాహల నిర్మూలన కొరకు ప్రగతి సంస్థ చేస్తున్న కృషి గురించి ఈ సందర్బంగా ఆయన వివరించారు. శివరాత్రి దేవుడి పెళ్లి, సామూహిక వివాహాల సమయంలో పట్టణం నలుమూలలా చెక్ పోస్ట్ లు ఏర్పాటు చేసి గవర్నమెంట్ డిపార్టుమెంటులతో కలిసి పనిచేస్తామని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అనంతరం సిడిపివో శాంతి దుర్గ మాట్లాడుతూ.. బాల్యవివాహాలు చేసుకుంటే కలిగే అనర్ధాల గురించి, అంగన్వాడి సేవలు గురించి వివరించారు. మెడికల్ ఆఫీసర్ శివకుమార్ మాట్లాడుతూ బాల్య వివాహల వల్ల కలిగే ఆరోగ్య పరమైన, మానసిక సమస్యల గురించి, టీనేజి ప్రెగ్నెన్సీ గురించి, మాతా శిశు మరణాలు గురించి వివరించారు. ప్రిన్సిపాల్ మాధవి లత మాట్లాడుతూ చిన్న వయసులో ఆకర్షణలకు లోనై బాల్య వివాహాల బారిన పడకుండా పిల్లందరూ చక్కగా చదువుకుని పాఠశాలకు మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకువచ్చి ఉన్నత స్థానాలకు ఎదగాలన్నారు. సీఐ నాగార్జున రెడ్డి మాట్లాడుతూ..బాల్య వివాహాలపై వెంటనే 1098 చైల్డ్ హెల్ప్ లైన్ కు లేదా పోలీసులకు సమాచారం ఇవ్వాలి, బాల్య వివాహాలపై ఉపేక్షించేది లేదని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, ప్రగతి సంస్థ సిబ్బంది లక్ష్మి నారాయణ, చంద్ర శేఖర్, జయలక్ష్మి, బోస్, ప్రభాకర్ రాజేశ్వరమ్మ, సుమలత, కోటయ్య, లత, మోహన్ బాబు తదితరులు పాల్గొన్నారు.

బాల్య వివాహాలు అమూల్యమైన బాల్యాన్ని బలిగొంటాయి-ప్రగతి సంస్థ
శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, ఫిబ్రవరి 12: శ్రీకాళహస్తి పట్టణంలో అంబేద్కర్ బాలికల గురుకుల పాఠశాలలో ప్రగతి సంస్థ, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో బాల్య వివాహాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రగతి సంస్థ డైరెక్టర్ కెవి రమణ మాట్లాడుతూ….మహా శివరాత్రి సందర్భంగా శ్రీకాళహస్తిలో దేవుడి పెళ్లి రోజున ప్రతి యేటా సామూహిక వివాహాలు నిర్వహించడం ఆనవాయితీ. ఆది దంపతులకు పెళ్లి జరిపే రోజు వివాహాలు జరిగితే ఆ జంటలు కలకాలం ఆనందంగా, అన్యోన్యంగా ఉంటాయని ప్రజల విశ్వాసం. కానీ ఈ పర్వదినాన బాల్య వివాహాలు చోటు చేసుకోవడం తీవ్ర ఆవేదనకు గురి చేస్తోంది. మన నమ్మకాలకు, విశ్వాసాలకు అమూల్యమైన బాల్యాన్ని బలి ఇవ్వడం (బాల్య వివాహాలు చేయడం) చట్ట రీత్యా నేరం. బాల్య వివాహలకు పాల్పడితే కుటుంబ సభ్యులు, బంధువులు, పూజారి మొదలు క్యాటరింగ్ చేసిన వారి వరకు ప్రతి ఒక్కరూ శిక్షార్హులే. 2009 నుంచి మాస్ మ్యారేజెస్ సందర్భంగా బాల్య వివాహల నిర్మూలన కొరకు ప్రగతి సంస్థ చేస్తున్న కృషి గురించి ఈ సందర్బంగా ఆయన వివరించారు. శివరాత్రి దేవుడి పెళ్లి, సామూహిక వివాహాల సమయంలో పట్టణం నలుమూలలా చెక్ పోస్ట్ లు ఏర్పాటు చేసి గవర్నమెంట్ డిపార్టుమెంటులతో కలిసి పనిచేస్తామని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అనంతరం సిడిపివో శాంతి దుర్గ మాట్లాడుతూ.. బాల్యవివాహాలు చేసుకుంటే కలిగే అనర్ధాల గురించి, అంగన్వాడి సేవలు గురించి వివరించారు. మెడికల్ ఆఫీసర్ శివకుమార్ మాట్లాడుతూ బాల్య వివాహల వల్ల కలిగే ఆరోగ్య పరమైన, మానసిక సమస్యల గురించి, టీనేజి ప్రెగ్నెన్సీ గురించి, మాతా శిశు మరణాలు గురించి వివరించారు. ప్రిన్సిపాల్ మాధవి లత మాట్లాడుతూ చిన్న వయసులో ఆకర్షణలకు లోనై బాల్య వివాహాల బారిన పడకుండా పిల్లందరూ చక్కగా చదువుకుని పాఠశాలకు మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకువచ్చి ఉన్నత స్థానాలకు ఎదగాలన్నారు. సీఐ నాగార్జున రెడ్డి మాట్లాడుతూ..బాల్య వివాహాలపై వెంటనే 1098 చైల్డ్ హెల్ప్ లైన్ కు లేదా పోలీసులకు సమాచారం ఇవ్వాలి, బాల్య వివాహాలపై ఉపేక్షించేది లేదని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, ప్రగతి సంస్థ సిబ్బంది లక్ష్మి నారాయణ, చంద్ర శేఖర్, జయలక్ష్మి, బోస్, ప్రభాకర్ రాజేశ్వరమ్మ, సుమలత, కోటయ్య, లత, మోహన్ బాబు తదితరులు పాల్గొన్నారు.

