కాకినాడ జిల్లా, మార్చి 30 (పున్నమి న్యూస్ ప్రతినిధి ఆనంద్): బాబు జగజీవన్ రామ్ జయంతి సందర్భంగా ఎస్. అన్నవరం గ్రామంలోని ఎస్.సి కాలనీలో విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో భాగంగా విగ్రహ ఆవిష్కరణకు యనమల రామకృష్ణుడు గారు మరియు యనమల రాజేష్ గారిని ప్రత్యేక అతిథులుగా ఆహ్వానించినట్లు పేర్కొన్నారు.
గ్రామ అభివృద్ధి, సామాజిక ఐక్యతను పెంపొందించే లక్ష్యంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ వేడుకలకు గ్రామ ప్రజలు, యువత, మహిళలు అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు.
ఈ కార్యక్రమంలో టిడిపి సీనియర్ నాయకులు తుమ్మలపల్లి నాని, మధు, రామ్ దుర్గ, సందీప్, చరణ్ మరియు కుల పెద్దలు పాల్గొననున్నారు.



