*బయో పర్టిలైజర్ , యూరియా వినియోగం అవగాహన ర్యాలీ*
నాయుడుపేట, సెప్టెంబర్ (పున్నమి ప్రతినిధి దిలీప్ కుమార్)నాయుడుపేటలో బయో ఫెర్టిలైజర్ మరియు యూరియ వాడకం పై వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో రైతులకు అవగాహన కల్పిస్తు ర్యాలీ నిర్వహించారు. నాయుడుపేట వ్యవసాయ శాఖ కార్యాలయం నుండి బజారు వీధి ద్వారా పాత బస్టాండ్ వరకు ఈ అవగాహన ర్యాలీ నిర్వహించారు అనంతరం పాత బస్టాండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద మానవహారంగా ఏర్పడి రైతులకు అవగాహన కల్పిస్తూ నినాదాలు చేశారు ,ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు, సిబ్బంది మరియు రైతులు పాల్గొన్నారు.


