ఈరోజు అసెంబ్లీ నందు ప్రివిలేజ్ కమిటీ తొలి సమావేశం జరిగింది..కమిటీ చైర్మన్,ఎమ్మెల్సీ బీటీ.నాయుడు గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి కమిటీకి చెందిన సభ్యులు జయేంద్ర భరత్ గారు,పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు,తలసీల రఘురాం గారు,రాజగోల్ల రమేష్ యాదవ్ గారు మరియు అధికారులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా శాసనమండలి సభ్యుల హక్కులు అధికారాలు,అలాగే వచ్చిన ఫిర్యాదులపై విస్తృతంగా చర్చ జరిగింది.సభ్యుల ప్రతిష్టను కాపాడే దిశగా కమిటీ మరింత క్రియాశీలకంగా వ్యవహరించాలని నిర్ణయాలు తీసుకున్నట్టు సమాచారం..


