ముధోల్ మండలంలోని ఏడ్బిడ్ గ్రామంలో ఆదిక వర్షాపాతం వల్ల తోరి చెరువు కట్ట తెగిపోయే ప్రమాదం ఉందని గ్రామస్తులు బయబ్రాంతులకు గురి అవుతున్నారు. బి ఆర్ ఎస్ ప్రభుత్వ హయంలో మిషన్ కాకతీయలో చెరువు కట్ట మరియు పూడికలు సరిగా చేయలేక పోవటంవల్ల తోరి చెరువు ప్రమాదంగా మారిందని గ్రామస్తులు వాపోతున్నారు ఈ చెరువు క్రింద సుమారు 200 ల ఏకరాలకు సాగునీరు అందుతుందనీ , బి ఆర్ ఎస్ పాలకుల నిర్లక్ష్యం వల్ల కాంటాక్టర్ సదరు పనులను సక్రమంగా చేయక నిమిత్తమాత్రం చేసి బిల్లులు తిసుకోవడం జరిగిందని గ్రామస్తులు వాపోతున్నారు.కాంటాక్టర్ పై తగిన చర్యలు తిసుకోవాలని ఇరిగేషన్ ఎ ఇ దేవేందర్ ను కొరారు. ఇప్పుడైనా అధికారులు మరియు ప్రజాప్రతినిధులు చోరవ తీసుకొని చెరువు మరమ్మత్తులు చేయించాలని కోరుతున్నారు.ఈ చెరువు పరిషిలించినా యo పి డి ఓ శివకుమార్ మరియు ఆర్ ఐ నారాయణ్ పటేల్ ,ముధోల్ మండల కాంగ్రెస్ పార్టీ అద్యక్షులు రావుల గంగారెడ్డి గారు, పై అధికారుల దృష్టికి తిసుకెల్లి చెరువు మరమ్మత్తులు చేయిస్తామని గ్రామస్తులకు హామీ ఇచ్చారు


