‘ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నదని.. 99 రోజుల ప్రణాళిక మొదలుపెట్టిన రోజునే మంత్రులు, పలువురు ఎమ్మెల్యేలు సీఎం రేవంత్రెడ్డికి ముఖంమీదే చెప్పినట్టుగా తెలిసింది. తాము గ్రామసభలకు వెళ్లలేమని, ప్రస్తుత పరిస్థితుల్లో క్షేత్రస్థాయిలో పర్యటించే పరిస్థితులే లేవని తేల్చిచెప్పినట్టు సమాచారం. ప్రభుత్వపరంగా మనం ఏదో చేశామని గొప్పగా చెప్తున్నప్పటికీ అవేవీ ప్రజలకు చేరడం లేదని, ప్రభుత్వంపై ప్రజలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారని తేల్చిచెప్పినట్టు తెలిసింది. ముఖ్యంగా రైతుభరోసా పంపిణీ, యూరియా కొరత, పంటల కొనుగోలు, పింఛన్ల పెంపు వంటి అంశాలపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని చెప్పినట్టు తెలిసింది. సీఎంకు చెప్పినట్టుగానే ఎక్కువ మంది మంత్రులు, ఎమ్మెల్యేలు గ్రామసభలకు దూరంగా ఉండటం గమనార్హం.


