సెప్టెంబర్ చేజర్ల (పున్నమి ప్రతినిధి)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి 75 వ జన్మదినోత్సవం సందర్బంగా చేజర్ల మండలం కేంద్రం నందు చేజర్ల బీజేపీ మండల అధ్యక్షులు గుండాల విజయభాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో రెడ్ క్రాస్ సంస్థ ద్వారా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా బీజేపీ అధ్యక్షులు వంశిధర్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు బత్తల కిష్టయ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రధాని 75 వ జన్మదినం సందర్భంగా 75 మంది తో రక్తదానం చేయడం జరిగింది.రెడ్ క్రాస్ వారు మాట్లాడుతూ ఎన్నడూ లేని విధంగా చేజర్ల మండలంలో 75 మంది రక్తం ఇవ్వడం ఇదే మొదటి సారి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో చేజర్ల మండల బీజేపీ ఇంచార్జ్ భరత్ రెడ్డి, బీజేవైఎం మండల అధ్యక్షులు శివారెడ్డి, సీనియర్ నాయకులు జగ్గారెడ్డి, కోటేశ్వరెడ్డి, భద్రయ్య పాల్గొన్నారు.


