Thursday, 19 March 2026
  • Home  
  • ప్రజల విశేష స్పందనతో ముగిసిన ఉపాధి హామీ పరిరక్షణ యాత్ర- తలపా దామోదరం రెడ్డి
- తిరుపతి

ప్రజల విశేష స్పందనతో ముగిసిన ఉపాధి హామీ పరిరక్షణ యాత్ర- తలపా దామోదరం రెడ్డి

శ్రీకాళహస్తి, మార్చి 19, పున్నమి న్యూస్: వైఎస్ షర్మిలా రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన ఉపాధి హామీ పరిరక్షణ యాత్ర విజయవంతంగా ముగిసిందని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త తలపా దామోదరం రెడ్డి తెలిపారు. యాత్ర విషయాలపై ఆయన మాట్లాడుతూ…ఫిబ్రవరి 2న అనంతపురం జిల్లాలో ప్రారంభమైన ఈ యాత్ర, నేడు విశాఖపట్నం జిల్లాలో విజయవంతంగా ముగిసిందన్నారు. రాష్ట్రంలోని సుమారు 29 జిల్లాల్లో నిర్వహించిన 48 సభలకు ప్రజల నుంచి విశేష స్పందన లభించిందని తెలిపారు. ఉపాధి హామీ కూలీలు “కొత్త చట్టం వద్దు – పాత చట్టం ముద్దు” అని కోరుకుంటున్నారని, ఈ యాత్ర ప్రభావంతో కొత్త చట్టం అమలు మరో రెండు నెలలు వాయిదా పడిందని పేర్కొన్నారు. ప్రజా సమస్యలపై ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మాత్రమే పోరాడుతోందని, రాబోయే రోజులు కాంగ్రెస్ పార్టీవేనని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ యాత్రలో మాజీ కేంద్ర మంత్రులు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గ సమన్వయకర్తలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని యాత్రను విజయవంతం చేశారు.

శ్రీకాళహస్తి, మార్చి 19, పున్నమి న్యూస్: వైఎస్ షర్మిలా రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన ఉపాధి హామీ పరిరక్షణ యాత్ర విజయవంతంగా ముగిసిందని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త తలపా దామోదరం రెడ్డి తెలిపారు. యాత్ర విషయాలపై ఆయన మాట్లాడుతూ…ఫిబ్రవరి 2న అనంతపురం జిల్లాలో ప్రారంభమైన ఈ యాత్ర, నేడు విశాఖపట్నం జిల్లాలో విజయవంతంగా ముగిసిందన్నారు. రాష్ట్రంలోని సుమారు 29 జిల్లాల్లో నిర్వహించిన 48 సభలకు ప్రజల నుంచి విశేష స్పందన లభించిందని తెలిపారు. ఉపాధి హామీ కూలీలు “కొత్త చట్టం వద్దు – పాత చట్టం ముద్దు” అని కోరుకుంటున్నారని, ఈ యాత్ర ప్రభావంతో కొత్త చట్టం అమలు మరో రెండు నెలలు వాయిదా పడిందని పేర్కొన్నారు. ప్రజా సమస్యలపై ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మాత్రమే పోరాడుతోందని, రాబోయే రోజులు కాంగ్రెస్ పార్టీవేనని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ యాత్రలో మాజీ కేంద్ర మంత్రులు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గ సమన్వయకర్తలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని యాత్రను విజయవంతం చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.