1జనవరి 2004 నుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు నూతన పెన్షన్ విధానాన్ని అప్పటి ప్రభుత్వం ఆమోదించి, 2024 వ సంవత్సరం సెప్టెంబర్ 1 నుండి కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ను కేంద్రం అమలు చేసింది. ఈ విధానం ద్వారా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా 01.09.2004 నుండి కొత్తగా ప్రభుత్వ సర్వీసులో చేరిన వారికి ఆంధ్ర ప్రదేశ్ రివైజెడ్ పెన్షన్ రూల్స్ 1980 ని సవరిస్తూ ప్రభుత్వ పాత పెన్షన్ విధానాన్ని రద్దు చేసి ఈ కొత్త పెన్షన్ విధానాన్ని అమలు చేసింది. అప్పటి ఏకచక్రాదిపత్యం గల సంఘం ప్రభుత్వాన్ని ప్రశ్నించక పోవడం చేత దాదాపు దశాబ్ద కాలం తరువాత రామాంజనేయులు 2015 వ సంవత్సరం లో సిపిఎస్ అంతం మా పంతం అంటూ ఏర్పడిన ఏపీ సిపిఎస్ఈఏ సంఘం గా 581 /2015 ద్వారా సంఘం రిజిస్టర్ కాబడి అనేక నిరసన కార్యక్రమాలు నిర్వహించడం వలన దేశ చరిత్రలోనే పదవి విరమణ చేసిన సిపిఎస్ ఉద్యోగులకు గ్రాట్యుటీ, ఫ్యామిలీ పెన్షన్ సాధించిన సంఘంగా ఉద్యోగుల మన్ననలు పొంది, నేడు ఏపీ సీపీఎస్ఈఏ సంఘం గౌరవ అధ్యక్షులుగా రామాంజనేయులు, అధ్యక్ష, కార్యదర్శులుగా బాజీ పఠాన్, కరిమి రాజేశ్వరరావు కొనసాగుతూ, కా కె ఆర్ సూర్యనారాయణ నేతృత్వంలో ఏర్పడిన ఐక్య వేదిక లో భాగమై సిపిఎస్ పూర్తి గా రద్దు కై పోరాటం చేస్తున్నది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మెమో 57 ఉద్యోగ, ఉపాధ్యాయులకు వజ్రాయుధం అయింది. జనవరి 1 2004 కు ముందు నోటిఫై చేసిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు నూతన పెన్షన్ విధానంలోకి అనివార్యంగా వచ్చిన సందర్భంగా వారు కోర్టులను ఆశ్రయించారు. వివిధ రాష్ట్రాల హైకోర్టులు, కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్ కోర్ట్ తీర్పులను సూచిస్తూ, వివిధ ప్రాతినిధ్యాలు, నిర్ణయాల దృష్ట్యా డిసెంబర్ 31, 2003 కి ముందు ఎంపికై జనవరి, 1 2004 తరువాత నియామకమైన ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం మెమో 57 ప్రకారము పాత పెన్షన్ అప్షన్ ను కేంద్ర ప్రభుత్వం కల్పించింది. ఇప్పటి వరకు భారత దేశంలో మెమో 57 ప్రకారం భారతీయ రైలు, తపాలా, సెంట్రల్ బెటాలియన్ దళం, తదితర కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, సుమారు 16 రాష్ట్రాల్లోని ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని పునరుద్దరించారు కానీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రమే పాత పెన్షన్ అమలుకు నిర్ణయం తీసుకోలేదు. అయితే రాష్ట్ర ప్రభుత్వంలోని ముగ్గురు ఐఏఎస్ అధికారులకు కేం ద్ర ప్రభుత్వం మెమో 57 ప్రకారం 2023లో గత రాష్ట్ర ప్రభుత్వం పాత పెన్షన్ ను పునరుద్దరించిన విషయం తెలిసిందే. అత్యున్నత హోదాలో ఉన్న అధికారులకు ఒక న్యాయం, దిగువ స్థాయిలో ఉన్న ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఒక న్యాయం సరైన విధానం కాదు అని ఆంధ్ర ప్రదేశ్వరభుత్వ ఉద్యోగుల సంఘం భావిస్తుంది. రాష్ట్రంలో గత ప్రభుత్వం 2022 లో ఉద్యోగ సమస్యలపై నియమించిన మంత్రి వర్గ ఉప సంఘం కేంద్ర ప్రభుత్వ మెమో 57 ప్రకారం తేది 01.09.2004 ముందు గా వెలువడిన నోటిఫికేషన్ తరువాత నియమకమైన వారికి పాత పెన్షన్ విదానాన్ని పునరుద్దరించడానికి అంగీకరించింది. అలాగే 2024 ఫిబ్రవరిలో ఉద్యోగ సంఘాలతో నిర్వహించిన సివిల్ సర్వీస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో అర్హత గల ఉద్యోగ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానాన్ని పునరుద్దరించడానికి లిఖితపూర్వక హామీ కూడా ఇచ్చింది. ప్రభుత్వ ఉద్యోగ నియమక ప్రక్రియ, నిబందనలకు సంబందించి సీజేఐ జస్టిస్ డి.వై.చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం నవంబరు 7 2023 న కిలక తీర్పు వెల్లడించింది. నియామకాల సమయంలో నియమాలను మరచిపోకూడదని, ఉద్యోగ నియామక ప్రక్రియ నిబంధనలు ఏకపక్షంగా ఉండకూడదని కోర్టు నొక్కి చెప్పింది. రాజ్యాంగంలో పేర్కొన్న ఆర్టికల్ 14 కు అనుగుణంగా ఉండాలని, వివక్షకు తావు ఉండకూడదని పేర్కొంది. కేంద్ర ప్రభుత్వ మెమో 57 ఆధారంగా సెప్టెంబర్, 1 2004 కు ముందు నియామకమైన ఉద్యోగ, ఉపాధ్యాయుల వివరాలను 2022 నుండి ఇప్పటి వరకు దాదాపు 20 సార్లు రాష్ట్ర ప్రభుత్వం సేకరించింది. గత ప్రభుత్వం వారంలో సిపిఎస్ రద్దు చేస్తాం అని హామీ ఇచ్చి కూడా మొండి చెయ్యి చూపించింది. అంతే కాకుండా సిపిఎస్ కాదు మెరుగైన జిపిఎస్ విధానం అంటూ ఉద్యోగ, ఉపాధ్యాయులను మభ్య పెట్టింది. ప్రస్తుతము కుటమి ప్రభుత్వం 2024 ఎన్నికల సమయంలో తాము అధికారంలోకి వచ్చిన సంవత్సరంలో నే సిపిఎస్, జిపిఎస్ విధానాన్ని సమీక్షించి, అందరికి అమోద యోగ్యమైన నిర్ణయం తీసుకుంటాం అని మేనిఫెస్టో లో హామీ ఇవ్వడం జరిగింది. కాని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం ఆరు నెలల కాలం గడిచిన, సమస్యల పట్ల సాచివేత ధోరణితోనే ఉంది. ప్రపంచంలో నే అతి పెద్ద రాజ్యాంగం ఉన్న భారత దేశంలో ప్రజా సేవకులు అనే నిర్వచనం కిందికి వచ్చే ప్రజా ప్రతినిధులకు, ఉద్యోగులకు ఒకే రకమైన పెన్షన్ విధానం ఉండాలి. కానీ ప్రస్తుతం అటువంటి పరిస్థితి ఎక్కడ కనిపించడం లేదు. ఈమధ్య కాలంలో భారత దేశ ఉప రాష్ట్రపతిగా కొనసాగి గత నెల అనగా జూలై మాసంలో ఉప రాష్ట్రపతి పదవికి అనారోగ్య కారణాలు చూపి రాజీనామా చేసిన జగదీప్ ధన్ ఖడ్ గారికి రాజస్థాన్ రాష్ట్రం మాజీ శాసన సభ్యులుగా, పార్లమెంట్ సభ్యులుగా మరియు మాజీ ఉప రాష్ట్రపతిగా మొత్తం మూడు రకాల పెన్షన్లు మరియు మాజీ ఉప రాష్ట్రపతి హోదాలో ఇతర సదుపాయాలు అందుబాటులోకి వస్తాయి . కానీ 30 సంవత్సరాల సర్వీసు చేసిన ఉద్యోగ, ఉపాధ్యాయులకు పెన్షన్ లేకపోవడం రాజ్యాంగ ఉల్లంఘనే అవుతుంది. కావున, ఇప్పటికైనా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తక్షణం స్పందించి రాష్ట్రంలో ఉన్న సుమారు 11,000 మంది ఉద్యోగాలు, ఉపాధ్యాయులకు కేంధ్ర ప్రభుత్వం మెమో 57 ప్రకారము పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని అదే విధముగా సిపిఎస్ ను పూర్తి స్థాయిలో రద్దు చేసి ఉద్యోగ, ఉపాధ్యాయులందరికి పాత పెన్షన్ విధాన్ని పునరుద్దరించాలని ఉద్యోగ, ఉపాధ్యాయుల తరుపున ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నంద్యాల జిల్లా పక్షాన విజ్ఞప్తి చేస్తున్నాము.

పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు – నాగేంద్రప్ప, జిల్లా కోశాధికారి శ్రీనివాసులు
1జనవరి 2004 నుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు నూతన పెన్షన్ విధానాన్ని అప్పటి ప్రభుత్వం ఆమోదించి, 2024 వ సంవత్సరం సెప్టెంబర్ 1 నుండి కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ను కేంద్రం అమలు చేసింది. ఈ విధానం ద్వారా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా 01.09.2004 నుండి కొత్తగా ప్రభుత్వ సర్వీసులో చేరిన వారికి ఆంధ్ర ప్రదేశ్ రివైజెడ్ పెన్షన్ రూల్స్ 1980 ని సవరిస్తూ ప్రభుత్వ పాత పెన్షన్ విధానాన్ని రద్దు చేసి ఈ కొత్త పెన్షన్ విధానాన్ని అమలు చేసింది. అప్పటి ఏకచక్రాదిపత్యం గల సంఘం ప్రభుత్వాన్ని ప్రశ్నించక పోవడం చేత దాదాపు దశాబ్ద కాలం తరువాత రామాంజనేయులు 2015 వ సంవత్సరం లో సిపిఎస్ అంతం మా పంతం అంటూ ఏర్పడిన ఏపీ సిపిఎస్ఈఏ సంఘం గా 581 /2015 ద్వారా సంఘం రిజిస్టర్ కాబడి అనేక నిరసన కార్యక్రమాలు నిర్వహించడం వలన దేశ చరిత్రలోనే పదవి విరమణ చేసిన సిపిఎస్ ఉద్యోగులకు గ్రాట్యుటీ, ఫ్యామిలీ పెన్షన్ సాధించిన సంఘంగా ఉద్యోగుల మన్ననలు పొంది, నేడు ఏపీ సీపీఎస్ఈఏ సంఘం గౌరవ అధ్యక్షులుగా రామాంజనేయులు, అధ్యక్ష, కార్యదర్శులుగా బాజీ పఠాన్, కరిమి రాజేశ్వరరావు కొనసాగుతూ, కా కె ఆర్ సూర్యనారాయణ నేతృత్వంలో ఏర్పడిన ఐక్య వేదిక లో భాగమై సిపిఎస్ పూర్తి గా రద్దు కై పోరాటం చేస్తున్నది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మెమో 57 ఉద్యోగ, ఉపాధ్యాయులకు వజ్రాయుధం అయింది. జనవరి 1 2004 కు ముందు నోటిఫై చేసిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు నూతన పెన్షన్ విధానంలోకి అనివార్యంగా వచ్చిన సందర్భంగా వారు కోర్టులను ఆశ్రయించారు. వివిధ రాష్ట్రాల హైకోర్టులు, కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్ కోర్ట్ తీర్పులను సూచిస్తూ, వివిధ ప్రాతినిధ్యాలు, నిర్ణయాల దృష్ట్యా డిసెంబర్ 31, 2003 కి ముందు ఎంపికై జనవరి, 1 2004 తరువాత నియామకమైన ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం మెమో 57 ప్రకారము పాత పెన్షన్ అప్షన్ ను కేంద్ర ప్రభుత్వం కల్పించింది. ఇప్పటి వరకు భారత దేశంలో మెమో 57 ప్రకారం భారతీయ రైలు, తపాలా, సెంట్రల్ బెటాలియన్ దళం, తదితర కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, సుమారు 16 రాష్ట్రాల్లోని ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని పునరుద్దరించారు కానీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రమే పాత పెన్షన్ అమలుకు నిర్ణయం తీసుకోలేదు. అయితే రాష్ట్ర ప్రభుత్వంలోని ముగ్గురు ఐఏఎస్ అధికారులకు కేం ద్ర ప్రభుత్వం మెమో 57 ప్రకారం 2023లో గత రాష్ట్ర ప్రభుత్వం పాత పెన్షన్ ను పునరుద్దరించిన విషయం తెలిసిందే. అత్యున్నత హోదాలో ఉన్న అధికారులకు ఒక న్యాయం, దిగువ స్థాయిలో ఉన్న ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఒక న్యాయం సరైన విధానం కాదు అని ఆంధ్ర ప్రదేశ్వరభుత్వ ఉద్యోగుల సంఘం భావిస్తుంది. రాష్ట్రంలో గత ప్రభుత్వం 2022 లో ఉద్యోగ సమస్యలపై నియమించిన మంత్రి వర్గ ఉప సంఘం కేంద్ర ప్రభుత్వ మెమో 57 ప్రకారం తేది 01.09.2004 ముందు గా వెలువడిన నోటిఫికేషన్ తరువాత నియమకమైన వారికి పాత పెన్షన్ విదానాన్ని పునరుద్దరించడానికి అంగీకరించింది. అలాగే 2024 ఫిబ్రవరిలో ఉద్యోగ సంఘాలతో నిర్వహించిన సివిల్ సర్వీస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో అర్హత గల ఉద్యోగ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానాన్ని పునరుద్దరించడానికి లిఖితపూర్వక హామీ కూడా ఇచ్చింది. ప్రభుత్వ ఉద్యోగ నియమక ప్రక్రియ, నిబందనలకు సంబందించి సీజేఐ జస్టిస్ డి.వై.చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం నవంబరు 7 2023 న కిలక తీర్పు వెల్లడించింది. నియామకాల సమయంలో నియమాలను మరచిపోకూడదని, ఉద్యోగ నియామక ప్రక్రియ నిబంధనలు ఏకపక్షంగా ఉండకూడదని కోర్టు నొక్కి చెప్పింది. రాజ్యాంగంలో పేర్కొన్న ఆర్టికల్ 14 కు అనుగుణంగా ఉండాలని, వివక్షకు తావు ఉండకూడదని పేర్కొంది. కేంద్ర ప్రభుత్వ మెమో 57 ఆధారంగా సెప్టెంబర్, 1 2004 కు ముందు నియామకమైన ఉద్యోగ, ఉపాధ్యాయుల వివరాలను 2022 నుండి ఇప్పటి వరకు దాదాపు 20 సార్లు రాష్ట్ర ప్రభుత్వం సేకరించింది. గత ప్రభుత్వం వారంలో సిపిఎస్ రద్దు చేస్తాం అని హామీ ఇచ్చి కూడా మొండి చెయ్యి చూపించింది. అంతే కాకుండా సిపిఎస్ కాదు మెరుగైన జిపిఎస్ విధానం అంటూ ఉద్యోగ, ఉపాధ్యాయులను మభ్య పెట్టింది. ప్రస్తుతము కుటమి ప్రభుత్వం 2024 ఎన్నికల సమయంలో తాము అధికారంలోకి వచ్చిన సంవత్సరంలో నే సిపిఎస్, జిపిఎస్ విధానాన్ని సమీక్షించి, అందరికి అమోద యోగ్యమైన నిర్ణయం తీసుకుంటాం అని మేనిఫెస్టో లో హామీ ఇవ్వడం జరిగింది. కాని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం ఆరు నెలల కాలం గడిచిన, సమస్యల పట్ల సాచివేత ధోరణితోనే ఉంది. ప్రపంచంలో నే అతి పెద్ద రాజ్యాంగం ఉన్న భారత దేశంలో ప్రజా సేవకులు అనే నిర్వచనం కిందికి వచ్చే ప్రజా ప్రతినిధులకు, ఉద్యోగులకు ఒకే రకమైన పెన్షన్ విధానం ఉండాలి. కానీ ప్రస్తుతం అటువంటి పరిస్థితి ఎక్కడ కనిపించడం లేదు. ఈమధ్య కాలంలో భారత దేశ ఉప రాష్ట్రపతిగా కొనసాగి గత నెల అనగా జూలై మాసంలో ఉప రాష్ట్రపతి పదవికి అనారోగ్య కారణాలు చూపి రాజీనామా చేసిన జగదీప్ ధన్ ఖడ్ గారికి రాజస్థాన్ రాష్ట్రం మాజీ శాసన సభ్యులుగా, పార్లమెంట్ సభ్యులుగా మరియు మాజీ ఉప రాష్ట్రపతిగా మొత్తం మూడు రకాల పెన్షన్లు మరియు మాజీ ఉప రాష్ట్రపతి హోదాలో ఇతర సదుపాయాలు అందుబాటులోకి వస్తాయి . కానీ 30 సంవత్సరాల సర్వీసు చేసిన ఉద్యోగ, ఉపాధ్యాయులకు పెన్షన్ లేకపోవడం రాజ్యాంగ ఉల్లంఘనే అవుతుంది. కావున, ఇప్పటికైనా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తక్షణం స్పందించి రాష్ట్రంలో ఉన్న సుమారు 11,000 మంది ఉద్యోగాలు, ఉపాధ్యాయులకు కేంధ్ర ప్రభుత్వం మెమో 57 ప్రకారము పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని అదే విధముగా సిపిఎస్ ను పూర్తి స్థాయిలో రద్దు చేసి ఉద్యోగ, ఉపాధ్యాయులందరికి పాత పెన్షన్ విధాన్ని పునరుద్దరించాలని ఉద్యోగ, ఉపాధ్యాయుల తరుపున ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నంద్యాల జిల్లా పక్షాన విజ్ఞప్తి చేస్తున్నాము.

