శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, ఫిబ్రవరి 23: శ్రీకాళహస్తి పట్టణంలో జరుగుతున్న ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల సందర్భంగా పరీక్షా కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. ఈ సందర్భంగా టూ టౌన్ సిఐ నాగార్జున రెడ్డి స్వయంగా పలు పరీక్షా కేంద్రాలను సందర్శించి తనిఖీలు నిర్వహించారు. పరీక్షలు ప్రశాంత వాతావరణంలో, నిబంధనల ప్రకారం నిర్వహించబడుతున్నాయా అనే విషయాన్ని ఆయన పరిశీలించారు. కేంద్రాల వద్ద అనుమానాస్పద వ్యక్తులు గుమికూడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసు సిబ్బందికి సూచించారు. పరీక్షా కేంద్రాల పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ అమల్లో ఉన్నందున, అనవసరంగా గుంపులుగా నిలబడవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అలాగే విద్యార్థులు ప్రశాంతంగా పరీక్షలు రాయడానికి అవసరమైన భద్రతా వాతావరణాన్ని కల్పించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని సిఐ తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా నిరంతరం గస్తీ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద పోలీసుల పర్యవేక్షణతో పరీక్షలు సజావుగా కొనసాగుతున్నాయి.

పరీక్షా కేంద్రాల వద్ద తనిఖీలుచేపట్టిన టూ టౌన్ సి. ఐ. నాగార్జున రెడ్డి
శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, ఫిబ్రవరి 23: శ్రీకాళహస్తి పట్టణంలో జరుగుతున్న ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల సందర్భంగా పరీక్షా కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. ఈ సందర్భంగా టూ టౌన్ సిఐ నాగార్జున రెడ్డి స్వయంగా పలు పరీక్షా కేంద్రాలను సందర్శించి తనిఖీలు నిర్వహించారు. పరీక్షలు ప్రశాంత వాతావరణంలో, నిబంధనల ప్రకారం నిర్వహించబడుతున్నాయా అనే విషయాన్ని ఆయన పరిశీలించారు. కేంద్రాల వద్ద అనుమానాస్పద వ్యక్తులు గుమికూడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసు సిబ్బందికి సూచించారు. పరీక్షా కేంద్రాల పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ అమల్లో ఉన్నందున, అనవసరంగా గుంపులుగా నిలబడవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అలాగే విద్యార్థులు ప్రశాంతంగా పరీక్షలు రాయడానికి అవసరమైన భద్రతా వాతావరణాన్ని కల్పించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని సిఐ తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా నిరంతరం గస్తీ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద పోలీసుల పర్యవేక్షణతో పరీక్షలు సజావుగా కొనసాగుతున్నాయి.

