మండలం పరిషత్ ప్రైమరీ స్కూల్లో నిర్వహిస్తున్న G-FLN కార్యక్రమాన్ని సందర్శించిన ఉదయగిరి మండల విద్యాశాఖ అధికారి శ్రీ టి. వెంకటేశ్వర్లు గారు, ప్రతి విద్యార్థికి బలమైన అభ్యసన పునాది నిర్మించడమే ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. 75 రోజుల కార్యక్రమంలో భాగంగా 59వ రోజు నిర్వహించిన తెలుగు, గణిత, ఆంగ్ల కార్యకలాపాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అవగాహనతో చదవడం, రాయడం, ప్రాథమిక గణిత నైపుణ్యాలు సాధించడం ఈ పథకం ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ప్రతి విద్యార్థిని SKY స్థాయికి తీసుకురావాలని సూచించారు. కార్యక్రమాన్ని సమర్థంగా అమలు చేస్తున్న ప్రధానోపాధ్యాయులు శ్రీ షేక్ హుస్సేన్ భాషా గారిని అభినందించారు. CRMT షేక్ మోహిద్దీన్ కూడా పాల్గొన్నారు.



