Wednesday, 11 February 2026
  • Home  
  • పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ కి నివాళులర్పించిన బిజెపి నాయకులు
- తిరుపతి

పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ కి నివాళులర్పించిన బిజెపి నాయకులు

శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, ఫిబ్రవరి 11: శ్రీకాళహస్తి పట్టణంలో బేరివారి మండపం వద్ద బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్ అద్వర్యంలో బుదవారం నాడు మహనీయుడు పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ వర్ధంతి సందర్భంగా – సమర్పణ దివస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. మొదటగా కోలా ఆనంద్ పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ కి ఘననివాళులర్పించారు. ఈ సందర్బంగా భాజపా నాయకులు మాట్లాడుతూ…. దేశసేవ, త్యాగం, నిజాయితీకి ప్రతీకగా నిలిచిన మహానాయకుడు పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ అంత్యోదయ సిద్ధాంతంతో చివరి వ్యక్తి వరకు అభివృద్ధి చేరాలనే ఆశయంతో జీవితాంతం ప్రజల కోసం కృషి చేశారని ఆయన ఆశయాలకు అనుగుణంగా మనమందరం నడుచుకోవాలని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలోసీనియర్ నాయకులు గరికపాటి రమేష్ బాబు, చాగణం శైలజ, పట్టణ అధ్యక్షులు హరీష్ రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి కొండేటి గోపాల్, జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు కూనాటి నాగరాజు, జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు ప్రజ్ఞశ్రీ, రూరల్ మండలం అధ్యక్షులు భగీర్తి వెంకటేష్, అమర్నాథ్, ఉమా సింగ్, పుణ్యం ఢిల్లీ కుమార్, రాజనాల, తిరుపాల్ నాయుడు, కందాటి సుధాకర్, చందు రాయల్, రవి రాయల్, కృష్ణా రెడ్డి, శివా యాదవ్, శ్రీకర్ నాయుడు, రాజా, హుకుం సింగ్, రాజా నరసింహులు తదితరులు పాల్గొన్నారు.

శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, ఫిబ్రవరి 11: శ్రీకాళహస్తి పట్టణంలో బేరివారి మండపం వద్ద బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్ అద్వర్యంలో బుదవారం నాడు మహనీయుడు పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ వర్ధంతి సందర్భంగా – సమర్పణ దివస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. మొదటగా కోలా ఆనంద్ పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ కి ఘననివాళులర్పించారు. ఈ సందర్బంగా భాజపా నాయకులు మాట్లాడుతూ…. దేశసేవ, త్యాగం, నిజాయితీకి ప్రతీకగా నిలిచిన మహానాయకుడు పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ అంత్యోదయ సిద్ధాంతంతో చివరి వ్యక్తి వరకు అభివృద్ధి చేరాలనే ఆశయంతో జీవితాంతం ప్రజల కోసం కృషి చేశారని ఆయన ఆశయాలకు అనుగుణంగా మనమందరం నడుచుకోవాలని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలోసీనియర్ నాయకులు గరికపాటి రమేష్ బాబు, చాగణం శైలజ, పట్టణ అధ్యక్షులు హరీష్ రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి కొండేటి గోపాల్, జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు కూనాటి నాగరాజు, జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు ప్రజ్ఞశ్రీ, రూరల్ మండలం అధ్యక్షులు భగీర్తి వెంకటేష్, అమర్నాథ్, ఉమా సింగ్, పుణ్యం ఢిల్లీ కుమార్, రాజనాల, తిరుపాల్ నాయుడు, కందాటి సుధాకర్, చందు రాయల్, రవి రాయల్, కృష్ణా రెడ్డి, శివా యాదవ్, శ్రీకర్ నాయుడు, రాజా, హుకుం సింగ్, రాజా నరసింహులు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.