శ్రీకాళహస్తి, మార్చి 27 (పున్నమి న్యూస్): భారతీయ జనతా పార్టీలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ‘ప్రశిక్షణ’ (శిక్షణా తరగతుల) కార్యక్రమం నేడు శ్రీకాళహస్తి పట్టణంలోని NVS కన్వెన్షన్ హాల్ నందు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి శ్రీకాళహస్తి రూరల్, పట్టణ, తొట్టంబేడు మండలాలకు చెందిన పార్టీ కార్యకర్తలు, నాయకులు భారీ సంఖ్యలో హాజరుకావాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, నియోజకవర్గ ఇంచార్జ్ కోలా ఆనంద్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కోలా ఆనంద్ మాట్లాడుతూ.. బీజేపీలో ప్రశిక్షణ కార్యక్రమానికి ఎంతో విశిష్టత ఉందని, పార్టీ సిద్ధాంతాలు, భవిష్యత్ కార్యాచరణపై కార్యకర్తలకు ఇందులో అవగాహన కల్పిస్తామని తెలిపారు. ప్రతి పోలింగ్ బూత్ నుంచి కార్యకర్తలు తప్పనిసరిగా నిర్ణీత సమయానికి హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన ఆదేశించారు. పార్టీ బలోపేతానికి ఈ శిక్షణా తరగతులు కీలకమని, నాయకులు, కార్యకర్తలు క్రమశిక్షణతో పాల్గొని పార్టీని గ్రామ స్థాయిలోకి తీసుకెళ్లాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ స్థాయి ముఖ్య నేతలు కూడా పాల్గొననున్నారు.

నేడు శ్రీకాళహస్తిలో బీజేపీ ప్రతిష్టాత్మక ‘ప్రశిక్షణ’ కార్యక్రమం
శ్రీకాళహస్తి, మార్చి 27 (పున్నమి న్యూస్): భారతీయ జనతా పార్టీలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ‘ప్రశిక్షణ’ (శిక్షణా తరగతుల) కార్యక్రమం నేడు శ్రీకాళహస్తి పట్టణంలోని NVS కన్వెన్షన్ హాల్ నందు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి శ్రీకాళహస్తి రూరల్, పట్టణ, తొట్టంబేడు మండలాలకు చెందిన పార్టీ కార్యకర్తలు, నాయకులు భారీ సంఖ్యలో హాజరుకావాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, నియోజకవర్గ ఇంచార్జ్ కోలా ఆనంద్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కోలా ఆనంద్ మాట్లాడుతూ.. బీజేపీలో ప్రశిక్షణ కార్యక్రమానికి ఎంతో విశిష్టత ఉందని, పార్టీ సిద్ధాంతాలు, భవిష్యత్ కార్యాచరణపై కార్యకర్తలకు ఇందులో అవగాహన కల్పిస్తామని తెలిపారు. ప్రతి పోలింగ్ బూత్ నుంచి కార్యకర్తలు తప్పనిసరిగా నిర్ణీత సమయానికి హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన ఆదేశించారు. పార్టీ బలోపేతానికి ఈ శిక్షణా తరగతులు కీలకమని, నాయకులు, కార్యకర్తలు క్రమశిక్షణతో పాల్గొని పార్టీని గ్రామ స్థాయిలోకి తీసుకెళ్లాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ స్థాయి ముఖ్య నేతలు కూడా పాల్గొననున్నారు.

