నియోజకవర్గ ప్రజలకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు మాజీ శాసనసభ్యులు మొండితోక జగన్మోహన్ రావు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.నందిగామ పట్టణంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లో నూతన సంవత్సర వేడుకలు కోలాహలంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్మోహన్ రావు కేకును కట్ చేసి పార్టీ శ్రేణులకు శుభాకాంక్షలు తెలిపారు.నియోజకవర్గంలోని నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో వచ్చిన పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు, వివిధ హోదాల్లో ఉన్న ప్రముఖులు జగన్మోహన్ రావును కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరి జీవితంలో ఆనందాలు వెల్లివిరియాలని, ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆయన భగవంతుని ప్రార్థించారు.



