శ్రీకాళహస్తి నారాయణ పాఠశాలలో స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా విద్యార్థులు తమ ఉపాధ్యాయుల సమక్షంలో తాము చదివిన పాఠ్యాంశాలు, ప్రాజెక్టులు,మరియు అకడమిక్ పురోగతిని, స్వయంగా తాము నేర్చుకున్న విషయాలను వివరిస్తూ,ప్రదర్శనల ద్వారా తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు తమ ప్రతిభను చూపించారు.దీని ద్వారా విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం,కమ్యూనికేషన్ నైపుణ్యాలు పెరుగుతాయని పాఠశాల నిర్వాహకులు తెలిపారు.ఈ సందర్బంగా ముఖ్య అతిధిగా విచ్చేసిన ఎ.జి.యం శ్రీనివాసులు మాట్లాడుతూ స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్ ద్వారా విద్యార్థులు తమ అభ్యాసంపై బాధ్యత తీసుకోవడం,తల్లిదండ్రులు తమ పిల్లల ప్రగతిని ప్రత్యక్షంగా తెలుసుకోవడం జరుగుతుందని అన్నారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ ఈశ్వరయ్య,ఆర్.ఓ నీలిమ,ఆర్.ఐ కిరణ్, ఆర్&డి గాయత్రి,వైస్ ప్రిన్సిపాల్ లత మరియు ఉపాధ్యాయులు,తల్లిదండ్రులు పాల్గొన్నారు.

నారాయణ పాఠశాలలో స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్ కార్యక్రమం
శ్రీకాళహస్తి నారాయణ పాఠశాలలో స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా విద్యార్థులు తమ ఉపాధ్యాయుల సమక్షంలో తాము చదివిన పాఠ్యాంశాలు, ప్రాజెక్టులు,మరియు అకడమిక్ పురోగతిని, స్వయంగా తాము నేర్చుకున్న విషయాలను వివరిస్తూ,ప్రదర్శనల ద్వారా తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు తమ ప్రతిభను చూపించారు.దీని ద్వారా విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం,కమ్యూనికేషన్ నైపుణ్యాలు పెరుగుతాయని పాఠశాల నిర్వాహకులు తెలిపారు.ఈ సందర్బంగా ముఖ్య అతిధిగా విచ్చేసిన ఎ.జి.యం శ్రీనివాసులు మాట్లాడుతూ స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్ ద్వారా విద్యార్థులు తమ అభ్యాసంపై బాధ్యత తీసుకోవడం,తల్లిదండ్రులు తమ పిల్లల ప్రగతిని ప్రత్యక్షంగా తెలుసుకోవడం జరుగుతుందని అన్నారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ ఈశ్వరయ్య,ఆర్.ఓ నీలిమ,ఆర్.ఐ కిరణ్, ఆర్&డి గాయత్రి,వైస్ ప్రిన్సిపాల్ లత మరియు ఉపాధ్యాయులు,తల్లిదండ్రులు పాల్గొన్నారు.

