శ్రీకాళహస్తి, మార్చి 18 (పున్నమి న్యూస్): ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోదరుడు, చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే దివంగత నేత నారా రామమూర్తి నాయుడు 74వ జయంతి వేడుకలు నారావారిపల్లెలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నారా రామమూర్తి నాయుడు సతీమణి నారా ఇందిరా, కుమారులు నారా గిరీష్, నారా రోహిత్ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలిసి జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం శృతి వనంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, కేక్ కట్ చేసి ఆయనతో ఉన్న అనుబంధాన్ని, జ్ఞాపకాలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమానికి శ్రీకాళహస్తి ఎంజీఎం గ్రూప్ చైర్మన్ గుడ్లూరు మల్లికార్జున్ నాయుడు హాజరై శ్రీకాళహస్తిలోని తమ హోటల్ ఎంజీఎం గ్రాండ్ లో ఉన్న తోటలో రుద్రాక్ష పండ్ల నుంచి వచ్చిన రుద్రాక్ష పండ్లతో తయారు చేసిన 36 గింజల రుద్రాక్ష మాలను నారా కుటుంబ సభ్యులకు బహుకరించారు. ఈ వేడుకల్లో బంధువులు, అభిమానులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. శాప్ చైర్మన్ రవి నాయుడు, యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్ తదితరులు హాజరై నివాళులు అర్పించారు.

నారా వారికి రుద్రాక్షమాలను బహుకరించిన ఎంజీఎం గ్రూప్ చైర్మన్ మల్లికార్జున్ నాయుడు
శ్రీకాళహస్తి, మార్చి 18 (పున్నమి న్యూస్): ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోదరుడు, చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే దివంగత నేత నారా రామమూర్తి నాయుడు 74వ జయంతి వేడుకలు నారావారిపల్లెలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నారా రామమూర్తి నాయుడు సతీమణి నారా ఇందిరా, కుమారులు నారా గిరీష్, నారా రోహిత్ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలిసి జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం శృతి వనంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, కేక్ కట్ చేసి ఆయనతో ఉన్న అనుబంధాన్ని, జ్ఞాపకాలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమానికి శ్రీకాళహస్తి ఎంజీఎం గ్రూప్ చైర్మన్ గుడ్లూరు మల్లికార్జున్ నాయుడు హాజరై శ్రీకాళహస్తిలోని తమ హోటల్ ఎంజీఎం గ్రాండ్ లో ఉన్న తోటలో రుద్రాక్ష పండ్ల నుంచి వచ్చిన రుద్రాక్ష పండ్లతో తయారు చేసిన 36 గింజల రుద్రాక్ష మాలను నారా కుటుంబ సభ్యులకు బహుకరించారు. ఈ వేడుకల్లో బంధువులు, అభిమానులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. శాప్ చైర్మన్ రవి నాయుడు, యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్ తదితరులు హాజరై నివాళులు అర్పించారు.

