నకిరేకల్ :నవంబర్ ( పున్నమి ప్రతినిధి )
రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు నల్గొండ జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను చేసినట్టు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఇలా త్రిపాటి, నల్గొండ జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకురాలిగా నియమితులైన ఐఏఎస్ అధికారి, రాష్ట్ర వేర్ హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ కొర్రా లక్ష్మికి వివరించారు. గురువారం గ్రామపంచాయతీ ఎన్నికల సాధారణ పరిశీలకురాలు కొర్ర లక్ష్మీ నల్గొండ కలెక్టరేట్ కు రాగ జిల్లా కలెక్టర్ పూల మొక్కతో స్వాగతం పలికారు. అనంతరం ఎన్నికల పరీశీలకురాలు కొర్ర లక్ష్మి, జిల్లా కలెక్టర్, స్థానిక సంస్థల ఇన్చార్జి అదనపు కలెక్టర్ నారాయణ అమిత్ లతో కలిసి నార్కెట్ పల్లి గ్రామ సచివాలయంలో ఏర్పాటు చేసిన క్లస్టర్ నామినేషన్ కేంద్రాన్ని, అనంతరం చిట్యాల మండలంలో వెలిమినేడు గ్రామ సచివాలయంలో ఏర్పాటుచేసిన క్లస్టర్ నామినేషన్ కేంద్రాలను అక్కడ ఏర్పాట్లను పరిశీలించారు.

నల్గొండ కలెక్టరేట్ కు వచ్చిన ఎన్నికల సాధారణ పరిశీలకురాలు
నకిరేకల్ :నవంబర్ ( పున్నమి ప్రతినిధి ) రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు నల్గొండ జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను చేసినట్టు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఇలా త్రిపాటి, నల్గొండ జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకురాలిగా నియమితులైన ఐఏఎస్ అధికారి, రాష్ట్ర వేర్ హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ కొర్రా లక్ష్మికి వివరించారు. గురువారం గ్రామపంచాయతీ ఎన్నికల సాధారణ పరిశీలకురాలు కొర్ర లక్ష్మీ నల్గొండ కలెక్టరేట్ కు రాగ జిల్లా కలెక్టర్ పూల మొక్కతో స్వాగతం పలికారు. అనంతరం ఎన్నికల పరీశీలకురాలు కొర్ర లక్ష్మి, జిల్లా కలెక్టర్, స్థానిక సంస్థల ఇన్చార్జి అదనపు కలెక్టర్ నారాయణ అమిత్ లతో కలిసి నార్కెట్ పల్లి గ్రామ సచివాలయంలో ఏర్పాటు చేసిన క్లస్టర్ నామినేషన్ కేంద్రాన్ని, అనంతరం చిట్యాల మండలంలో వెలిమినేడు గ్రామ సచివాలయంలో ఏర్పాటుచేసిన క్లస్టర్ నామినేషన్ కేంద్రాలను అక్కడ ఏర్పాట్లను పరిశీలించారు.

