పున్నమి న్యూస్, సామర్లకోట 1/11
సామర్లకోట తహశీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి దేవులపల్లి కృష్ణశాస్త్రి జన్మదిన సందర్భంగా కృష్ణశాస్త్రి నివాస ప్రాంతమైన చంద్రపాలెం పిఠాపురం దగ్గర ఉన్న దేవులపల్లి కృష్ణశాస్త్రి విగ్రహానికి పూలమాలవేసి ఆయన చేసిన ఎన్నో కార్యక్రమాలను గుర్తు చేసుకున్నారు. దేవులపల్లి కృష్ణశాస్త్రి నవంబర్ 1, 1897 వ సంవత్సరంలో తూర్పుగోదావరిలోని రామచంద్రపాలెం లో జన్మించారన్నారు. ఈయన తెలుగు కవి అని, తెలుగు భావా కవిత రంగంలో కృష్ణశాస్త్రి ఒక్క ముఖ్య అధ్యాయం అన్నారు. ఆయన రేడియోలో లలిత గీతాలు ,నాటికలు సినిమాల్లో పాటలు రాయడం ద్వారా ప్రఖ్యాతి పొందారన్నారు. చిన్న వయసు నుంచి రచనలు చేసేవారని పేర్కొన్నారు .1929 లో రవీంద్రనాథ ఠాగూర్ ని కలిశారన్నారు .1945లో ఆకాశవాణిలో చేరి అనేక పాటలు నాటికలు రచించారు .ఫిబ్రవరి 24 1980లో దేవులపల్లి కృష్ణశాస్త్రి మరణించారు అని గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో సామర్లకోట D .T. శ్రీనివాస్, తహశీల్దార్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

దేవులపల్లి కృష్ణశాస్త్రి జన్మదిన సందర్భంగా విగ్రహానికి పూలమాల వేస్తున సామర్లకోట తహశీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి.
పున్నమి న్యూస్, సామర్లకోట 1/11 సామర్లకోట తహశీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి దేవులపల్లి కృష్ణశాస్త్రి జన్మదిన సందర్భంగా కృష్ణశాస్త్రి నివాస ప్రాంతమైన చంద్రపాలెం పిఠాపురం దగ్గర ఉన్న దేవులపల్లి కృష్ణశాస్త్రి విగ్రహానికి పూలమాలవేసి ఆయన చేసిన ఎన్నో కార్యక్రమాలను గుర్తు చేసుకున్నారు. దేవులపల్లి కృష్ణశాస్త్రి నవంబర్ 1, 1897 వ సంవత్సరంలో తూర్పుగోదావరిలోని రామచంద్రపాలెం లో జన్మించారన్నారు. ఈయన తెలుగు కవి అని, తెలుగు భావా కవిత రంగంలో కృష్ణశాస్త్రి ఒక్క ముఖ్య అధ్యాయం అన్నారు. ఆయన రేడియోలో లలిత గీతాలు ,నాటికలు సినిమాల్లో పాటలు రాయడం ద్వారా ప్రఖ్యాతి పొందారన్నారు. చిన్న వయసు నుంచి రచనలు చేసేవారని పేర్కొన్నారు .1929 లో రవీంద్రనాథ ఠాగూర్ ని కలిశారన్నారు .1945లో ఆకాశవాణిలో చేరి అనేక పాటలు నాటికలు రచించారు .ఫిబ్రవరి 24 1980లో దేవులపల్లి కృష్ణశాస్త్రి మరణించారు అని గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో సామర్లకోట D .T. శ్రీనివాస్, తహశీల్దార్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

