*తెలుగుదేశం పార్టీ తోనే అభివృద్ధి,సంక్షేమం:-తెలుగుదేశం పార్టీ గోనెగండ్ల*
*18-08-2025 న గోనెగండ్ల తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు గోనెగండ్ల మండలం,గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు సమావేశం నిర్వహించి వారు మాట్లాడుతు తెలుగుదేశం పార్టీ తోనే సంక్షేమం,అభివృద్ధి అన్నారు.కూటమి ప్రభుత్వం ఏర్పడిన సంవత్సర కాలంలోనే ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు,డ్రైనేజీలు మరియు సంక్షేమ పథకలతో మెగా DSC,దీపం పథకం ద్వారా ఫ్రీగా 3గ్యాస్ సిలిండర్లు,తల్లికి వందనం పథకంతో ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే అందరికి 13,000రూపాయలు,అన్నదాత సుఖీభవ పథకంతో ప్రతి రైతుకు ఆర్థిక సహాయం,స్త్రీ శక్తి పథకంతో మహిళాలకు రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లిన ఉచిత బస్సు ప్రయాణం ఇలాంటి ఎన్నో పథకలు ప్రజలకు కూటమి ప్రభుత్వం అందిస్తుంది అని వారు అన్నారు.ఈ కార్యక్రమంలో మండలం,గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు,కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు……*


