నెల్లూరు జిల్లా గూడూరు రూరల్ చిల్లకూరు మండలం తూర్పుకనుపూరులో 10 నుంచి 13 మార్చి వరకు జరగనున్న శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి జాతర సందర్భంగా జిల్లా ఎస్పీ డా. అజిత వేజెండ్ల ఐపీఎస్ బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించారు. ఆలయ ప్రాంగణంలో కంట్రోల్ రూమ్, బారికేడింగ్, క్యూ లైన్లు, ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్ ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. సుమారు ఐదు లక్షల మంది భక్తులు రానున్న నేపథ్యంలో QRT టీమ్స్, మొబైల్ పెట్రోలింగ్, డ్రోన్ సర్వైలెన్స్, సీసీటీవీ పర్యవేక్షణ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. జూదం, డైమండ్ డబ్బా వంటి అక్రమాలను అరికట్టాలని, భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు.

తూర్పుకనుపూరు శ్రీ ముత్యాలమ్మ జాతరపై ఎస్పీ పర్యవేక్షణ
నెల్లూరు జిల్లా గూడూరు రూరల్ చిల్లకూరు మండలం తూర్పుకనుపూరులో 10 నుంచి 13 మార్చి వరకు జరగనున్న శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి జాతర సందర్భంగా జిల్లా ఎస్పీ డా. అజిత వేజెండ్ల ఐపీఎస్ బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించారు. ఆలయ ప్రాంగణంలో కంట్రోల్ రూమ్, బారికేడింగ్, క్యూ లైన్లు, ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్ ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. సుమారు ఐదు లక్షల మంది భక్తులు రానున్న నేపథ్యంలో QRT టీమ్స్, మొబైల్ పెట్రోలింగ్, డ్రోన్ సర్వైలెన్స్, సీసీటీవీ పర్యవేక్షణ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. జూదం, డైమండ్ డబ్బా వంటి అక్రమాలను అరికట్టాలని, భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు.

