పెడన నియోజకవర్గం కృత్తివెన్ను మండలం కృత్తివెన్ను గ్రామంలో మొంథా తుఫాన్ ప్రభావం వల్ల మరణించిన కొయ్య సుబ్బారావు గారి కుటుంబానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయానికి సంబందించిన చెక్కు ని ఈ రోజు పెడన శాసనసభ్యులు శ్రీ కాగిత కృష్ణ ప్రసాద్ గారు అందించడం జరిగింది.
ప్రకృతి వైపరీత్యాల్లో సైతం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం ప్రజలకు అన్ని విధాల అండగా నిలిచిందని, మొంతా తుఫాన్ నేపద్యంలో తీసుకున్న ముందస్తు చర్యల వల్ల ప్రజలకు ఎంతో మేలు చేయగలిగామని, ప్రభుత్వం తీసుకున్న ముందస్తు చర్యల పట్ల ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారని పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ గారు తెలిపారు.


