తుఫాన్ ఎఫెక్ట్ – పలు జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు ప్రకటించిన అధికారులు!
దక్షిణ తీరాంధ్రపై తుఫాన్ ప్రభావం కొనసాగుతోంది. భారీ గాలులు, వర్షాలు ముప్పుగా మారే అవకాశం ఉండడంతో జిల్లా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని పలు జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు ప్రకటించారు.
కృష్ణా జిల్లాలో అక్టోబర్ 27, 28, 29 తేదీల్లో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. తూర్పు గోదావరి మరియు అన్నమయ్య జిల్లాల్లో 27, 28 తేదీల్లో విద్యాసంస్థలు మూసివేయనున్నట్లు అధికారులు తెలిపారు.
చీరాల డివిజన్లో కూడా సోమవారం నుంచి మూడు రోజులపాటు స్కూల్ హాలిడేస్ అమల్లోకి వస్తున్నాయి. తుఫాన్ తీవ్రతను బట్టి తరువాతి నిర్ణయం తీసుకుంటామని విద్యాశాఖ అధికారులు వెల్లడించారు.
విద్యార్థులు, తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని, అవసరం లేకుండా బయటకు వెళ్లవద్దని హెచ్చరించారు. వర్షాలు, గాలులు మరింత ఉధృతంగా కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
తుఫాన్ ప్రభావం తగ్గే వరకు ఇంట్లోనే సురక్షితంగా ఉండాలని అధికారులు సూచించారు.


