9 బంగారు, 21 వెండి పతకాలు సాధించిన షిటోరియు సికో కాయి కరాటే విద్యార్థులు
మంథని, జనవరి 05:
హనుమకొండ జిల్లా పరకాలలోని మయూరి గార్డెన్లో ఆదివారం నిర్వహించిన జాతీయ కరాటే పోటీల్లో జపాన్ షిటోరియు సికో కాయి కరాటే ఇంటర్నేషనల్ సంస్థకు చెందిన మంథని విద్యార్థులు అలాగే దర్యాప్తూర్ ఆదర్శ పాఠశాల విద్యార్థులు విశేష ప్రతిభ కనబరిచారు. కరాటే శిక్షకులు కావేటి సమ్మయ్య ఆధ్వర్యంలో పాల్గొన్న విద్యార్థులు సబ్ జూనియర్స్, క్యాడేట్స్ కతా, కుమితే విభాగాల్లో 9 బంగారు, 21 వెండి పతకాలు సాధించారు.
వీరిలో జోగుల అభిరామ్, మాచర్ల శివ, వాసంశెట్టి ఉదయ్ కుమార్, ఎలివేణి నిషిత్, జడగాల మనస్వి, శాన్వి, అరణ్య, సహస్ర, అక్షిత బంగారు పతకాలను, అదే విధంగా కేసరి సహస్ర, అంజలి, వైష్ణవి, బి. సహస్ర వెండి పతకాలు సాధించారు.
పతకాలు సాధించిన విద్యార్థులను షిటోరియు షికో కాయి కరాటే, కియో ఇండియా అధ్యక్షులు పి. భరత్ శర్మ, తెలంగాణ ప్రతినిధి పాలకుర్తి పాపయ్య, కార్యనిర్వాహణ అధ్యక్షులు గుంటుపల్లి సమ్మయ్య, చీఫ్ ఆర్గనైజర్ మాడ సంపత్, తెలంగాణ స్పోర్ట్స్ కరాటే అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ప్రధాన కార్యదర్శి మల్యాల రామస్వామి, కోశాధికారి మల్లికార్జున గౌడ్, దర్యాప్తూర్ ఆదర్శ పాఠశాల ప్రిన్సిపాల్ కేసరి సంతోష్, శిక్షకులు, ఇన్స్ట్రక్టర్లు అభినందించారు.


