Saturday, 7 March 2026
  • Home  
  • జర్నలిస్టుల భద్రతకు సుప్రీంకోర్టు బలమైన భరోసా
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

జర్నలిస్టుల భద్రతకు సుప్రీంకోర్టు బలమైన భరోసా

దేశంలో వర్కింగ్ జర్నలిస్టులు, పాత్రికేయులను బెదిరించడం, దూషించడం లేదా దాడి చేయడం వంటి చర్యలను తీవ్రంగా పరిగణించాలని అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. గురువారం జరిగిన ఒక కేసు విచారణ సందర్భంగా, ఇలాంటి చర్యలకు పాల్పడిన వారికి రూ.50,000 వరకు జరిమానాతో పాటు ఐదేళ్ల వరకు కఠిన కారాగార శిక్ష విధించే అవకాశం ఉందని పేర్కొంది. ఈ తీర్పు జర్నలిస్టులకు రక్షణ కల్పించే దిశగా కీలకంగా మారిందని పలు జర్నలిస్టు సంఘాల నాయకులు, సీనియర్ పాత్రికేయులు అభిప్రాయపడ్డారు. ఈ నిర్ణయంతో పాత్రికేయులు భయాందోళనల లేకుండా నిజమైన సమాచారాన్ని ప్రజలకు అందించగలరని తెలిపారు. అలాగే రాజకీయ నాయకులు లేదా ఇతరుల నుంచి ఒత్తిడి తగ్గి మీడియా స్వేచ్ఛ మరింత బలపడుతుందని వారు సంతృప్తి వ్యక్తం చేశారు.

దేశంలో వర్కింగ్ జర్నలిస్టులు, పాత్రికేయులను బెదిరించడం, దూషించడం లేదా దాడి చేయడం వంటి చర్యలను తీవ్రంగా పరిగణించాలని అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. గురువారం జరిగిన ఒక కేసు విచారణ సందర్భంగా, ఇలాంటి చర్యలకు పాల్పడిన వారికి రూ.50,000 వరకు జరిమానాతో పాటు ఐదేళ్ల వరకు కఠిన కారాగార శిక్ష విధించే అవకాశం ఉందని పేర్కొంది. ఈ తీర్పు జర్నలిస్టులకు రక్షణ కల్పించే దిశగా కీలకంగా మారిందని పలు జర్నలిస్టు సంఘాల నాయకులు, సీనియర్ పాత్రికేయులు అభిప్రాయపడ్డారు. ఈ నిర్ణయంతో పాత్రికేయులు భయాందోళనల లేకుండా నిజమైన సమాచారాన్ని ప్రజలకు అందించగలరని తెలిపారు. అలాగే రాజకీయ నాయకులు లేదా ఇతరుల నుంచి ఒత్తిడి తగ్గి మీడియా స్వేచ్ఛ మరింత బలపడుతుందని వారు సంతృప్తి వ్యక్తం చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.