Sunday, 5 April 2026
  • Home  
  • జనసేన కార్యకర్త కుటుంబానికి కొండంత అండ – బీమా చెక్కు అందజేత
- తిరుపతి

జనసేన కార్యకర్త కుటుంబానికి కొండంత అండ – బీమా చెక్కు అందజేత

శ్రీకాళహస్తి, ఏప్రిల్ 05 (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తి నియోజకవర్గానికి చెందిన జనసేన పార్టీ క్రియాశీల కార్యకర్త బుర్రా చైతన్య కాంత్ కుటుంబానికి ఆ పార్టీ అండగా నిలిచింది. ఇటీవల చైతన్య కాంత్ సతీమణి బుర్ర ప్రియాంక అకాల మరణం చెందడం పార్టీ శ్రేణులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ క్రమంలో మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ రామ్ తాళ్లూరి బాధిత కుటుంబ సభ్యులకు పార్టీ తరపున ప్రమాద బీమా చెక్కును అందజేశారు. ఈ విషయం తెలుసుకున్న జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి, శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థాన ధర్మకర్తల మండలి అధ్యక్షులు కొట్టే సాయి ప్రసాద్ ఆదివారం నాడు పట్టణంలోని చైతన్య కాంత్ నివాసానికి వెళ్లారు. మృతురాలి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం, కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా కొట్టే సాయి ప్రసాద్ మాట్లాడుతూ.. పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్తను ఒక కుటుంబ సభ్యునిలా చూసుకోవడం జనసేన పార్టీ సంప్రదాయం. బుర్ర ప్రియాంక మరణం ఆ కుటుంబానికి తీరని లోటు. బాధలో ఉన్న ఆ కుటుంబానికి జనసేన పార్టీ ఎల్లప్పుడూ వెన్నంటి ఉంటుందని భరోసా ఇచ్చారు. పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా ప్రతి కార్యకర్త సంక్షేమానికి పార్టీ కట్టుబడి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొని బాధిత కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

శ్రీకాళహస్తి, ఏప్రిల్ 05 (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తి నియోజకవర్గానికి చెందిన జనసేన పార్టీ క్రియాశీల కార్యకర్త బుర్రా చైతన్య కాంత్ కుటుంబానికి ఆ పార్టీ అండగా నిలిచింది. ఇటీవల చైతన్య కాంత్ సతీమణి బుర్ర ప్రియాంక అకాల మరణం చెందడం పార్టీ శ్రేణులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ క్రమంలో మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ రామ్ తాళ్లూరి బాధిత కుటుంబ సభ్యులకు పార్టీ తరపున ప్రమాద బీమా చెక్కును అందజేశారు. ఈ విషయం తెలుసుకున్న జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి, శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థాన ధర్మకర్తల మండలి అధ్యక్షులు కొట్టే సాయి ప్రసాద్ ఆదివారం నాడు పట్టణంలోని చైతన్య కాంత్ నివాసానికి వెళ్లారు. మృతురాలి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం, కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా కొట్టే సాయి ప్రసాద్ మాట్లాడుతూ.. పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్తను ఒక కుటుంబ సభ్యునిలా చూసుకోవడం జనసేన పార్టీ సంప్రదాయం. బుర్ర ప్రియాంక మరణం ఆ కుటుంబానికి తీరని లోటు. బాధలో ఉన్న ఆ కుటుంబానికి జనసేన పార్టీ ఎల్లప్పుడూ వెన్నంటి ఉంటుందని భరోసా ఇచ్చారు. పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా ప్రతి కార్యకర్త సంక్షేమానికి పార్టీ కట్టుబడి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొని బాధిత కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.