Saturday, 28 February 2026
  • Home  
  • చిట్టి చేతుల.. ‘విజ్ఞాన’ అద్భుతాలు!
- అన్నమయ్య

చిట్టి చేతుల.. ‘విజ్ఞాన’ అద్భుతాలు!

జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం చిట్వేలిలోని శ్రీ సాయి వికాస్ పాఠశాల లో విద్యార్థులు ప్రదర్శించిన సైన్స్ నమూనాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. చిన్నారులు తమ చిట్టి చేతులతో రూపొందించిన ప్రయోగాలు చూపర్లను మంత్రముగ్ధులను చేశాయి. తొలుత విద్యాసంస్థల అధ్యక్షురాలు తిరుమల రెడ్డమ్మ జ్యోతి ప్రజ్వలన చేసి, నోబెల్ విజేత సర్ సి.వి.రామన్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన వివిధ నమూనాలు శాస్త్రీయ పరిజ్ఞానాన్ని చాటిచెప్పాయి. ముఖ్యంగా నాల్గవ తరగతి విద్యార్థినులు **పప్పుధాన్యాలను ఉపయోగించి మానవ దేహంలోని అవయవాలను** తీర్చిదిద్దిన తీరు అందరినీ ఆశ్చర్యపరిచింది. వర్షపు నీటి నిల్వ పర్యావరణ పరిరక్షణ, నిత్యజీవితంలో సైన్స్ ప్రాముఖ్యతను వివరించే పలు ప్రయోగాలు సందర్శకుల ప్రశంసలు అందుకున్నాయి. ప్రధానోపాధ్యాయులు రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. నిత్యజీవితంలో ప్రతి అంశం సైన్స్‌తో ముడిపడి ఉంటుందని, ఇలాంటి ప్రదర్శనల వల్ల విద్యార్థుల్లో పరిశోధనాత్మక ఆలోచనలు పెరుగుతాయని పేర్కొన్నారు. ప్రైమరీ విభాగం బాధ్యులు మాధవి మాట్లాడుతూ.. చిన్న పిల్లలు సైతం ఎంతో ఉత్సాహంగా ఈ ప్రదర్శనలో పాల్గొనడం సంతోషకరమన్నారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు నువ్వల శ్రీనివాసులు, ఎం. రమణ, వరలక్ష్మి, ప్రియాంక, ధనలక్ష్మి, లక్ష్మి మరియు విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం చిట్వేలిలోని శ్రీ సాయి వికాస్ పాఠశాల లో విద్యార్థులు ప్రదర్శించిన సైన్స్ నమూనాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. చిన్నారులు తమ చిట్టి చేతులతో రూపొందించిన ప్రయోగాలు చూపర్లను మంత్రముగ్ధులను చేశాయి. తొలుత విద్యాసంస్థల అధ్యక్షురాలు తిరుమల రెడ్డమ్మ జ్యోతి ప్రజ్వలన చేసి, నోబెల్ విజేత సర్ సి.వి.రామన్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన వివిధ నమూనాలు శాస్త్రీయ పరిజ్ఞానాన్ని చాటిచెప్పాయి. ముఖ్యంగా నాల్గవ తరగతి విద్యార్థినులు **పప్పుధాన్యాలను ఉపయోగించి మానవ దేహంలోని అవయవాలను** తీర్చిదిద్దిన తీరు అందరినీ ఆశ్చర్యపరిచింది. వర్షపు నీటి నిల్వ పర్యావరణ పరిరక్షణ, నిత్యజీవితంలో సైన్స్ ప్రాముఖ్యతను వివరించే పలు ప్రయోగాలు సందర్శకుల ప్రశంసలు అందుకున్నాయి.
ప్రధానోపాధ్యాయులు రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. నిత్యజీవితంలో ప్రతి అంశం సైన్స్‌తో ముడిపడి ఉంటుందని, ఇలాంటి ప్రదర్శనల వల్ల విద్యార్థుల్లో పరిశోధనాత్మక ఆలోచనలు పెరుగుతాయని పేర్కొన్నారు. ప్రైమరీ విభాగం బాధ్యులు మాధవి మాట్లాడుతూ.. చిన్న పిల్లలు సైతం ఎంతో ఉత్సాహంగా ఈ ప్రదర్శనలో పాల్గొనడం సంతోషకరమన్నారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు నువ్వల శ్రీనివాసులు, ఎం. రమణ, వరలక్ష్మి, ప్రియాంక, ధనలక్ష్మి, లక్ష్మి మరియు విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.