ఖమ్మం పున్నమి ప్రతినిధి
ఖమ్మం నగరం లోని గట్టయ్య సెంటర్ లక్ష్మి నర్సింహా స్వామి టెంపుల్ రోడ్డు నందు విజయ దుర్గ అమ్మవారి ఉత్సవ కమిటీ వారు ఏర్పాటు చేసిన శ్రీ కనక దుర్గ అమ్మ వారి విగ్రహ నిమజ్జనం కార్యక్రమం శనివారం నాడు అంగరంగా వైభవం గా జరిగింది. 11 రోజులుగా భక్తులు పూజలు అందుకున్న అమ్మ వారు నిమజ్జనం కొరకు తరలి వెళ్ళింది. భక్తులని చల్లగా చూడాలని, అందరు సుఖ సంతోషాలతో ఉండాలని ఈ సం దర్భముగా కమిటీ వారు అమ్మ వారిని కోరుకున్నారు. భక్తుల కోలాటం డిజే వెంట రాగ పుర వీధిల్లో ఊరేగింపు చేసి నిమజ్జనం కొరకు ఆంధ్రప్రదేశ్ కృష్ణ జిల్లా వేదాద్రి పుణ్య క్షేత్రం లో ని కృష్ణ నదిలో అమ్మ వారి ని నిమజ్జనం చేశారు. కార్యక్రమం లో విజయదుర్గ ఉత్సవ కమిటీ సభ్యులు అమ్మ వారి భక్తులు పాల్గొన్నారు.


