కామారెడ్డి, 30 సెప్టెంబర్, పున్నమి ప్రతినిధి :
కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల గాంధీ యువజన సమాఖ్య ఆధ్వర్యంలో 18వ వార్షికోత్స వమును పురస్కరించుకొని ప్రతిష్ఠించిన అష్టాదశ శక్తి పీఠాల వద్ద అమ్మవారి నవరాత్రి ఉత్సవాలను ప్రతి ఏటా మాదిరిగానే ఈ సంవత్సరం అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు.ప్రతిరోజు అమ్మవారిని ఒక్కొక్క అవతార అలంకరణతో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా,తొమ్మిదో రోజున దుర్గామాత అలంకారం సందర్భంగా సామూహిక సత్యనారా యణ వ్రతాలను ఘనంగా నిర్వహించారు. ఈ వ్రతంలో 12 మంది దంపతులు పాల్గొన్నారు.
ప్రతి రోజు ఉదయం, సాయంత్రం వేళల్లో పూజా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. పూజల అనంతరం భజన కార్యక్రమం, దాండియా, కోలాటాలు వంటి ఆటపాటలతో భక్తులు భక్తిశ్రద్ధ లతో ఉత్సవాలలో పాలుపంచుకుంటున్నారు.ఈ కార్యక్రమాలలో మహిళలు, మాల స్వాములు, కండువా స్వాములు, బాల స్వాములు, కంకణం స్వాములతో పాటు గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు అందుకుంటు న్నారు. ఇట్టి కార్యక్రమం గాంధీ యువజన సమా ఖ్య పాలకమండలి ఆధ్వర్యంలో విజయవంతంగా కొనసాగుతోంది.


