
కేన్సర్ పై అవగాహన కార్యక్రమం
అగనంపూడి, పున్నమి ప్రతినిధి.
అగనంపూడి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో హోమి బాబా కేన్సర్ హాస్పటల్ వారు కేన్సర్ పై అవగాహన కార్యక్రమం అగనంపూడి హైస్కూల్ దగ్గర ఉన్న కమ్యూనిటీ వెల్ఫేర్ సెంటర్ లో బుధవారం జరిగినది. సుమారు 100 మందికి పైగా మహిళలు మరియు అగనంపూడి హైస్కూలు మహిళా విద్యార్థినులు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగినది. భవిష్యత్ లో కేన్సర్ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో హామీ బాబా కేన్సర్ హాస్పటల్ డాక్టర్లు, హాస్పటల్ సిబ్బంది మరియు విదేశాల నుంచి వచ్చిన డాక్టర్స్ వివరంగా చెప్పడం జరిగినది.
ఈ కార్యక్రమంలో డాక్టర్ డోలోరోసా ఫెర్నాండెస్,
డాక్టర్ ప్రదీప్, డాక్టర్ నమిత మరియు హాస్పటల్ సిబ్బంది, లయన్స్ క్లబ్ ప్రతినిధులు పాల్గొనడం జరిగినది.

