గద్వాల్ డిసెంబర్ 28( పున్నమి ప్రతినిధి)
కార్యకర్తలకు ఎల్లవేళలా అండగా ఉంటానంటున్న మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్
సర్పంచ్ ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థులకు భరోసాగా నిలుస్తున్న సంపత్ కుమార్ .
అలంపూర్ నియోజకవర్గం ఐజ మండలం సింధనూరు గ్రామంలో కొద్దిరోజుల క్రితం జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఓటమి పాలైన సర్పంచ్ వార్డు మెంబర్ అభ్యర్థులు ఏఐసీసీ కార్యదర్శి అలంపూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎస్ ఏ సంపత్ కుమార్ గారిని కలిసి శాలువ తో సత్కరించి ఓటమి చెందిన అభ్యర్థులు ఓటమి ను తలచుకుని బాధపడటం జరిగింది. వారికి కాంగ్రెస్ పార్టీ సంపత్ కుమార్ ఎల్లవేళలా అండగా ఉంటారని గ్రామాల అభివృద్ధిలో గెలుపు ఓటములతో సంబంధం లేకుండా కాంగ్రెస్ కార్యకర్తలు పాలుపంచుకోవాలని గ్రామాభివృద్ధి లక్ష్యంగా పని చేయాలని వారికి సంపత్ కుమార్ గారు తెలిపారు.అనంతరం ఆ గ్రామంలో గెలిచిన వార్డు సభ్యులకు శాలువ కప్పి సత్కరించారు


