ఏన్కూరు మండలం పరిధిలోని నాచారం శ్రీ అద్భుత వెంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని శనివారం వైరా శాసనసభ్యులు మాలోతు రాందాస్ నాయక్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. నాచారం గ్రామానికి చెందిన బొబ్బిలి అనే కాంగ్రెస్ కార్యకర్త మోక్కును చెల్లించడానికి వచ్చినట్లు తెలిపారు. శాసనసభ ఎన్నికల్లో వైరా అసెంబ్లీ స్థానం నుండి మాలోత్ రాందాస్ నాయక్ విజయం సాధించాలని కార్యకర్త బొబ్బిలి ఇక్కడ మొక్కుకోవడం జరిగింది. అతని కోరిక మేరకు మోక్కును చెల్లించడం జరిగింది. ఈ సందర్భంగా అర్చకులు ఎమ్మెల్యేను శాలువాతో సత్కరించి, వేదమంత్రాలతో పూజలు నిర్వహించారు. అనంతరం మహా అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నాచారం శ్రీ అద్భుత వెంకటేశ్వర స్వామి దేవాలయ కమిటీని త్వరలో ఎన్నుకొని, దేవాలయ అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. దేవాలయం నుండి ఏన్కూర్ ప్రధాన సెంటర్ వరకు సుప్రభాతం వినేందుకు మైకులను ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవాలయ అర్చకులు, ఈవో శేషయ్య, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు స్వర్ణ నరేందర్, ఏఎంసీ చైర్మన్ లచ్చిరాం నాయక్, ఏ బ్లాక్ అధ్యక్షులు వేముల కృష్ణ ప్రసాద్, మండల మహిళా అధ్యక్షురాలు ప్రభావతి రెడ్డి, మాజీ ఎంపీటీసీ మేడా ధర్మారావు, హిమామ్ నగర్ మాజీ సర్పంచ్ మాలోతు నరసింహారావు, వక్కంతుల నాగార్జున, వక్కంతుల గుత్తా వెంకటేశ్వర్లు సాగర్, అజ్మీర సురేష్ నాయక్, దళపతి భువనేశ్వర్ రాజు, పంతగాని నరేష్,సాయి రోహిత్, నాచారం గ్రామస్తులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మోక్కును చెల్లించిన ఎమ్మెల్యే మలోత్ రాందాస్ నాయక్
ఏన్కూరు మండలం పరిధిలోని నాచారం శ్రీ అద్భుత వెంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని శనివారం వైరా శాసనసభ్యులు మాలోతు రాందాస్ నాయక్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. నాచారం గ్రామానికి చెందిన బొబ్బిలి అనే కాంగ్రెస్ కార్యకర్త మోక్కును చెల్లించడానికి వచ్చినట్లు తెలిపారు. శాసనసభ ఎన్నికల్లో వైరా అసెంబ్లీ స్థానం నుండి మాలోత్ రాందాస్ నాయక్ విజయం సాధించాలని కార్యకర్త బొబ్బిలి ఇక్కడ మొక్కుకోవడం జరిగింది. అతని కోరిక మేరకు మోక్కును చెల్లించడం జరిగింది. ఈ సందర్భంగా అర్చకులు ఎమ్మెల్యేను శాలువాతో సత్కరించి, వేదమంత్రాలతో పూజలు నిర్వహించారు. అనంతరం మహా అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నాచారం శ్రీ అద్భుత వెంకటేశ్వర స్వామి దేవాలయ కమిటీని త్వరలో ఎన్నుకొని, దేవాలయ అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. దేవాలయం నుండి ఏన్కూర్ ప్రధాన సెంటర్ వరకు సుప్రభాతం వినేందుకు మైకులను ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవాలయ అర్చకులు, ఈవో శేషయ్య, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు స్వర్ణ నరేందర్, ఏఎంసీ చైర్మన్ లచ్చిరాం నాయక్, ఏ బ్లాక్ అధ్యక్షులు వేముల కృష్ణ ప్రసాద్, మండల మహిళా అధ్యక్షురాలు ప్రభావతి రెడ్డి, మాజీ ఎంపీటీసీ మేడా ధర్మారావు, హిమామ్ నగర్ మాజీ సర్పంచ్ మాలోతు నరసింహారావు, వక్కంతుల నాగార్జున, వక్కంతుల గుత్తా వెంకటేశ్వర్లు సాగర్, అజ్మీర సురేష్ నాయక్, దళపతి భువనేశ్వర్ రాజు, పంతగాని నరేష్,సాయి రోహిత్, నాచారం గ్రామస్తులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

