సిపిఐ రాష్ట్ర మహాసభకు తరలి వెళ్లిన నాయకులు
కారంపూడి,ఆగస్టు 23(పున్నమి ప్రతినిధి).
ప్రకాశం జిల్లా ఒంగోలులో జరిగే సిపిఐ రాష్ట్ర 28వ మహాసభలకు మాచర్ల నియోజకవర్గం లోని అన్ని మండలాల నుండి సిపిఐ నాయకులు కార్యకర్తలు యువత మహిళలు కార్మికులు రైతు సంఘం నాయకులు భారీ స్థాయిలో శనివారం తరలి వెళ్లారు. ఈ సందర్భంగా మాచర్ల ఏరియా కార్యదర్శి మేకపోతు శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ రైతు కూలీల సమస్యలు ధరల పెరుగుదల విద్యా ఆరోగ్య రంగాల్లో ప్రభుత్వ బాధ్యత మహాసభలో ప్రస్తావించనున్నట్లు ఆయన తెలిపారు. గ్రామస్థాయిలో పార్టీని బలోపేతం యువతను పార్టీలోకి పెద్ద ఎత్తున తీసుకురావడం వంటి అంశాలను గురించి మాట్లాడుతామన్నారు మహాసభకు వెళ్ళిన వారిలో కారంపూడి మండల కార్యదర్శి షేక్ సైదా, సహాయ కార్యదర్శి మేకపోతు చినుకోటిరెడ్డి దుర్గి మండల కార్యదర్శి కాల శివయ్య, మాచల పట్టణ కార్యదర్శి మిద్దె పోగు బాబురావు, రెంటచింతల మండల కార్యదర్శి కేతావత్తు రంగనాయకులు, ఏఐవైఎఫ్ నాయకులు రంగస్వామి శ్రీపతి సత్యనారాయణ నాగసుబ్బయ్య వెంకటాచారి బ్రహ్మచారి పార్వతయ్య, గాలం శ్రీనివాసరావు వెళ్లారు


