Saturday, 11 April 2026
  • Home  
  • ఏబీఎన్ దాడి యత్నం హేయమైన చర్య.. రాష్ట్రంలో ‘సాక్షి’ చిరునామా లేకుండా చేస్తాం
- తిరుపతి

ఏబీఎన్ దాడి యత్నం హేయమైన చర్య.. రాష్ట్రంలో ‘సాక్షి’ చిరునామా లేకుండా చేస్తాం

శ్రీకాళహస్తి, ఏప్రిల్ 07 (పున్నమి న్యూస్): హైదరాబాద్‌లోని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి కార్యాలయంపై వైసీపీ మూకలు దాడికి ప్రయత్నించడాన్ని శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. మంగళవారం పట్టణంలోని పంచాయతీరాజ్ భవనంలో కూటమి నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సుధీర్ రెడ్డి మాట్లాడుతూ.. పత్రికా స్వేచ్ఛను హరించేలా వైసీపీ వ్యవహరిస్తోందని మండిపడ్డారు. “తమ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒక్క ఆదేశం ఇస్తే చాలు.. రాష్ట్రంలో ‘సాక్షి’ పత్రిక కార్యాలయాలు లేకుండా చేసే సత్తా మాకు ఉంది. కానీ మా నాయకుడు ప్రజాస్వామ్యవాది, విలువలతో కూడిన రాజకీయాలు చేసే వ్యక్తి కాబట్టి మేము సంయమనం పాటిస్తున్నామనీ స్పష్టం చేశారు. వైసీపీ నాయకులు తమ తీరు మార్చుకోవాలని, పత్రికా విలేకరులను అణిచివేయాలని చూస్తే కూటమి శ్రేణుల తిరుగుబాటు తప్పదని ఆయన హెచ్చరించారు. గత ఐదేళ్ల అరాచక పాలన పోయిందని, ఇప్పటికైనా ప్రజాస్వామ్యబద్ధంగా నడుచుకోవాలని సూచించారు. మీడియాపై దాడులు ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టు అని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కూటమికి చెందిన పలువురు ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొని ఏబీఎన్ కార్యాలయంపై దాడి యత్నాన్ని ముక్తకంఠంతో ఖండించారు.

శ్రీకాళహస్తి, ఏప్రిల్ 07 (పున్నమి న్యూస్): హైదరాబాద్‌లోని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి కార్యాలయంపై వైసీపీ మూకలు దాడికి ప్రయత్నించడాన్ని శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. మంగళవారం పట్టణంలోని పంచాయతీరాజ్ భవనంలో కూటమి నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సుధీర్ రెడ్డి మాట్లాడుతూ.. పత్రికా స్వేచ్ఛను హరించేలా వైసీపీ వ్యవహరిస్తోందని మండిపడ్డారు. “తమ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒక్క ఆదేశం ఇస్తే చాలు.. రాష్ట్రంలో ‘సాక్షి’ పత్రిక కార్యాలయాలు లేకుండా చేసే సత్తా మాకు ఉంది. కానీ మా నాయకుడు ప్రజాస్వామ్యవాది, విలువలతో కూడిన రాజకీయాలు చేసే వ్యక్తి కాబట్టి మేము సంయమనం పాటిస్తున్నామనీ స్పష్టం చేశారు. వైసీపీ నాయకులు తమ తీరు మార్చుకోవాలని, పత్రికా విలేకరులను అణిచివేయాలని చూస్తే కూటమి శ్రేణుల తిరుగుబాటు తప్పదని ఆయన హెచ్చరించారు. గత ఐదేళ్ల అరాచక పాలన పోయిందని, ఇప్పటికైనా ప్రజాస్వామ్యబద్ధంగా నడుచుకోవాలని సూచించారు. మీడియాపై దాడులు ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టు అని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కూటమికి చెందిన పలువురు ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొని ఏబీఎన్ కార్యాలయంపై దాడి యత్నాన్ని ముక్తకంఠంతో ఖండించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.