విజయవాడ, ఫిబ్రవరి 20:
ఆంధ్రప్రదేశ్ ట్రెజరీ అండ్ అకౌంట్స్ గెజిటెడ్ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ ఎన్నికలు గురువారం విజయవాడలో ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా సభ్యులు ఉత్సాహంగా పాల్గొన్నారు. నూతనంగా ఏర్పడిన రాష్ట్ర కార్యవర్గంలో నెల్లూరు జిల్లా డివిజనల్ సబ్ ట్రెజరీలో సహాయ ఖజానా అధికారిగా విధులు నిర్వహిస్తున్న శ్రీ సయ్యద్ వహీద్దుద్దీన్ రహమాన్ గారు రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన ఎన్నికపై సహచర అధికారులు, సిబ్బంది, స్నేహితులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు. రాబోయే రోజుల్లో సంఘ బలోపేతానికి కృషి చేస్తానని రహమాన్ గారు తెలిపారు. సభ్యుల సంక్షేమం, సేవా నాణ్యత పెంపు దిశగా చర్యలు తీసుకుంటానని ఆయన హామీ ఇచ్చారు.


