శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ముందుగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా స్వర్ణముఖి నది శుద్ధి కార్యక్రమాన్ని యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి, ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి. గతంలో చెత్తాచెదారంతో నిండిపోయి, దుర్వాసనతో అపరిశుభ్రంగా మారిన స్వర్ణముఖి నది పరిసరాలను ఎమ్మెల్యే స్వయంగా పరిశీలించిన అనంతరం వేను వెంటనే నది ప్రక్షాళన చర్యలకు ఆదేశాలు జారీ చేశారు. అధికారులతో ప్రతి నిమిషం సమన్వయం చేస్తూ, పనులు వేగవంతం చేసి అద్భుతంగా నదిని ప్రక్షాళన చేయించారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు సమీపిస్తున్న నేపథ్యంలో (“శివం టు శివం రోడ్డు”) పనులను కూడా ఎమ్మెల్యే స్వయంగా పరిశీలించి, నిర్ణీత కాలానికి ముందే పూర్తి చేస్తున్నారు. పనుల సమయంలో పట్టణ ప్రజలకు, భక్తులకు ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఎమ్మెల్యే సూచనల మేరకు స్వర్ణముఖి నూతన నది ఘాట్లు, పరిసర ప్రాంతాలు పూర్తిగా శుభ్రపరచబడటంతో పాటు, భక్తులకు సౌకర్యవంతమైన వాతావరణం కల్పించబడింది. ఒకప్పుడు చెత్తతో నిండిపోయిన స్వర్ణముఖి, ఇప్పుడు సుందరంగా దర్శనమిస్తోంది. మహాశివరాత్రి సందర్భంగా వేలాది మంది భక్తులు ఇబ్బంది పడకుండా అభివృద్ధి పనులు పూర్తి కావడంపై ఎమ్మెల్యే బొజ్జల నాయకత్వాన్ని ప్రజలు ప్రశంసిస్తున్నారు.

ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆదేశాలతో శరవేగంగ స్వర్ణముఖి నది ప్రక్షాళన పనులు
శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ముందుగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా స్వర్ణముఖి నది శుద్ధి కార్యక్రమాన్ని యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి, ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి. గతంలో చెత్తాచెదారంతో నిండిపోయి, దుర్వాసనతో అపరిశుభ్రంగా మారిన స్వర్ణముఖి నది పరిసరాలను ఎమ్మెల్యే స్వయంగా పరిశీలించిన అనంతరం వేను వెంటనే నది ప్రక్షాళన చర్యలకు ఆదేశాలు జారీ చేశారు. అధికారులతో ప్రతి నిమిషం సమన్వయం చేస్తూ, పనులు వేగవంతం చేసి అద్భుతంగా నదిని ప్రక్షాళన చేయించారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు సమీపిస్తున్న నేపథ్యంలో (“శివం టు శివం రోడ్డు”) పనులను కూడా ఎమ్మెల్యే స్వయంగా పరిశీలించి, నిర్ణీత కాలానికి ముందే పూర్తి చేస్తున్నారు. పనుల సమయంలో పట్టణ ప్రజలకు, భక్తులకు ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఎమ్మెల్యే సూచనల మేరకు స్వర్ణముఖి నూతన నది ఘాట్లు, పరిసర ప్రాంతాలు పూర్తిగా శుభ్రపరచబడటంతో పాటు, భక్తులకు సౌకర్యవంతమైన వాతావరణం కల్పించబడింది. ఒకప్పుడు చెత్తతో నిండిపోయిన స్వర్ణముఖి, ఇప్పుడు సుందరంగా దర్శనమిస్తోంది. మహాశివరాత్రి సందర్భంగా వేలాది మంది భక్తులు ఇబ్బంది పడకుండా అభివృద్ధి పనులు పూర్తి కావడంపై ఎమ్మెల్యే బొజ్జల నాయకత్వాన్ని ప్రజలు ప్రశంసిస్తున్నారు.

