*పరకాల నియోజకవర్గం చరిత్రలో ఒక కొత్త అధ్యాయం…*
*-ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి*
*****!!!!!*****!!!!!*****!!!!!!*****!!!!!!*****
*ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి నేతృత్వంలో పరకాల నియోజకవర్గంలో మొదటి ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం.*
*పరకాల నియోజకవర్గ చరిత్రలో గురువారం రోజు ఒక ప్రత్యేక గుర్తుగా నిలిచిపోయింది.పరకాల మండలంలోని నాగారం గ్రామంలో పరకాల నియోజకవర్గంలో మొదటి ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది.*
*ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా విచ్చేసిన గౌరవ పరకాల నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీ,రేవూరి ప్రకాష్ రెడ్డి గారికీ పరకాల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కటుకూరి దేవేందర్ రెడ్డి-శ్రవంతి గార్లు గ్రామ ప్రజలు,లబ్ధిదారూలు,కాంగ్రెస్ పార్టీ నాయకులు,మహిళలు,కళకారులతో కలసి ఘన స్వాగతం పలికారు,నూతన ఇందిరామ్మా ఇండ్ల గృహ ప్రవేశం ఇండ్లల్లో రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు,లబ్ధిదారులకు ఎమ్మెల్యే శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు*
ఈ సందర్భంగా ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ గారు మాట్లాడుతూ,కొత్త ఇందిరమ్మ ఇల్లు కట్టుకున్న దంపతులను అభినందిస్తూ ఆనందం వ్యక్తం చేశారు. “మన కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇందిరమ్మ ఇళ్లు వాస్తవ రూపం దాలుస్తున్నాయి. గత ప్రభుత్వంలో ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా పూర్తిగా మంజూరు కాని, నిర్మాణం కాని పరిస్థితి ఉండేది. అయితే ఇప్పుడు మన పరకాల నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కావడం ప్రజల విశ్వాసానికి నిదర్శనం” అని తెలిపారు.
అలాగే,గతంలో నిర్వహించిన గడప గడప యాత్రలో ఎక్కువ మంది ప్రజలు ఇల్లు ఇవ్వాలని కోరరూ ప్రతి అర్హుడికి ఇల్లు కల్పిస్తానని అప్పట్లో హామీ ఇచ్చం,నేడు ఆ హామీ నెరవేరుతోందని ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి గారు పేర్కొన్నారు.
అంతేకాకుండా, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో కృషి చేసిన ప్రభుత్వ అధికారులు,గ్రామ పంచాయతీ కార్యదర్శులు,హౌసింగ్ శాఖ అధికారులు అందరికీ ఎమ్మెల్యే గారు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్,పరకాల మార్కెట్ కమిటీ చైర్మన్,పరకాల మండల మరియు పట్టణ కాంగ్రెస్ సమన్వయ పార్టీ సీనియర్ నాయకులు,కార్యకర్తలు,ప్రభుత్వ అధికారులు,గ్రామ కాంగ్రెస్ నాయకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు…


