ఎడతెరిపి లేని వర్షం వలన ఎక్కడైనా ప్రమాదకర పరిస్థితులు ఉంటే అధికారులు తక్షణమే తెలియజేయండి..
రైల్వే కోడూరు ఎంపీడీవో నాగిరెడ్డి
అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు మండలం అక్టోబర్ 22 ( పున్నమి న్యూస్ ప్రతినిధి )
కలెక్టర్ గారి ఆదేశాల మేరకు నిన్నటి ననుండి కురుస్తున్న ఎడతెరిపిలేని వర్షానికి మండల పరిధిలో ఉన్నటువంటి వాగులు, వంకలు, చెరువులు,రోడ్లు, పాఠశాలభవనాలు మరియు నివాస గృహాలు ఏవైనా ప్రమాదకర పరిస్థితిలో ఉన్నట్లయితే వాటి గురించి వీలైనంత త్వరలో సమాచారాన్ని తెలియజేయవలసిందిగా రైల్వే కోడూరు ఎంపీడీవో నాగిరెడ్డి సంబంధిత అధికారులకు సూచించారు
మరియు గ్రామ పంచాయతీ పరిధిలో ఎలాంటి అంటువ్యాధులు ప్రభలకుండా దోమల నివారణకు తగు చర్యలు తీసుకొని వలసినదిగా సంబంధిత అధికారులను కోరారు పై విషయాలపై గ్రామ ప్రజలకు అవగాహన కల్పిస్తూ చైతన్య పరుస్తూ ఆరోగ్య సూచనలు జారిచేస్తూ ఎలాంటి ప్రమాదాలకు మరియు వ్యాధుల బారిన పడకుండా వారికి సూచనలు ఇవ్వవలసినదిగా కోరారు


