ఉత్తర నియోజకవర్గం 45వ వార్డులో
ఎమ్మెల్యే, బీజేపీ ఫ్లోర్ లీడర్ శ్రీ పీ. విష్ణుకుమార్ రాజు గారు
విశాఖపట్నం పున్నమి ప్రతినిధి:-
ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు
ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ,
ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలోని ప్రతి అర్హుడికి పెన్షన్ అందేలా చర్యలు చేపట్టారని తెలిపారు.
ప్రజలకు ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాల ద్వారా ప్రతి కుటుంబం సంతోషంగా ఉండాలన్నదే ప్రభుత్వం లక్ష్యమని చెప్పారు.
కార్యక్రమంలో జీవీఎంసీ జోనల్ కమిషనర్ శ్రీ రాము గారు,
ఏపీడి శ్రీమతి పుణ్యవతి గారు,
బీజేపీ–టిడిపి–జనసేన కూటమి నాయకులు
ముత్యాల నాయుడు గారు, వార్డ్ అధ్యక్షులు నూకరాజు గారు, త్రినాధ్ గారు, వెంకటరమణ గారు, రాంబాబు గారు, సౌజన్య గారు, ఆశీర్వాదం గారు, రాజు గారు, మధు గారు, నాగరాజు గారు,
సచివాలయ సిబ్బంది మరియు స్థానిక నాయకులు పాల్గొన్నారు.


