అనకాపల్లి, అక్టోబర్ 22:
బుధవారం అనకాపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయం నందు జిల్లా ఇంచార్జీ మంత్రి కొల్లు రవీంద్ర అధ్యక్షతన మైన్స్ ఉచిత ఇసుక సరఫరాపై సమీక్షా సమావేశం జరిగింది.
ఈ సమావేశంలో రాష్ట్ర హోమ్ శాఖ మంత్రి వంగలపూడి అనిత, జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన, జిల్లా శాసనసభ్యులు, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
సమావేశంలో రాష్ట్ర వెలమ కార్పొరేషన్ చైర్మన్ పి.వి.జి. కుమార్ మాట్లాడుతూ –
ప్రజలకు ఇసుక సులభంగా అందుబాటులోకి రావడానికి, పారదర్శక వ్యవస్థను రూపొందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. ప్రతి గ్రామానికి అవసరమైన ఇసుక సరఫరా నిరంతరంగా ఉండేలా చర్యలు చేపట్టాం,”
అని తెలిపారు.
ఇక ఈ కార్యక్రమంలో
రాష్ట్ర అర్బన్ ఫైనాన్స్ & ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ
రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్, టీడీపీ జిల్లా అధ్యక్షులు బత్తుల తాతయ్య బాబు
గవర్ కార్పొరేషన్ చైర్మన్ మళ్ళ సురేంద్ర
ఉమ్మడి విశాఖ జిల్లాల డీసీఎంఎస్ చైర్మన్ కోట్లి బాలాజీ
తదితరులు పాల్గొన్నారు.
సమావేశంలో అధికారులు మైన్స్ నిర్వహణ, ఇసుక పంపిణీ సమర్థత, ప్రజల ఫిర్యాదుల పరిష్కారం వంటి అంశాలపై చర్చించారు.


