శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, మార్చి 09: శ్రీకాళహస్తి వేదికగా ఈ నెల 21, 22 తేదీల్లో జరగబోయే ఏపీ రైతు సంఘం జిల్లా రెండవ మహాసభలను జయప్రదం చేయాలని ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి హేమలత పిలుపునిచ్చారు. స్థానిక పుచ్చలపల్లి సుందరయ్య భవన్ లో సోమవారం రైతు సంఘం జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. హేమలత మాట్లాడుతూ..జిల్లాలో రైతాంగం అనేక సమస్యలు ఎదుర్కొంటోందని వరి అధికంగా పండే తూర్పు మండలాల్లో గిట్టుబాటు ధర లేక రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారని దళారీలే ధరలు నిర్ణయిస్తున్నారని వాపోయారు. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం లేదని ఉన్నా అవి మిల్లర్లకు దళారీగా వ్యవహరిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. నకిలీ విత్తనాల కారణంగా సూళ్ళూరు పేట మండలంలో 350 ఎకరాల్లో రైతులు పంట నష్టపోతే ప్రభుత్వం కనీసం పరిహారం అందించలేదని ఆవేదన వ్యక్తపరిచారు. ఇంకా పరిష్కారం కాని రైతాంగ సమస్యలు ఎన్నో ఉన్నాయనీ, వాటిన్నంటినీ మహ సభల్లో చర్చించి ఉద్యమ ప్రణాళికను సిద్ధం చేయనున్నట్లు తెలిపారు. మాజీ జిల్లా కార్యదర్శి అంగేరి పుల్లయ్య, రంగయ్య, మణి తదితరులు పాల్గొన్నారు.

ఈ నెల 21, 22న రైతు సంఘ మహా సభలు జయప్రదం చేయండి- హేమలత
శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, మార్చి 09: శ్రీకాళహస్తి వేదికగా ఈ నెల 21, 22 తేదీల్లో జరగబోయే ఏపీ రైతు సంఘం జిల్లా రెండవ మహాసభలను జయప్రదం చేయాలని ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి హేమలత పిలుపునిచ్చారు. స్థానిక పుచ్చలపల్లి సుందరయ్య భవన్ లో సోమవారం రైతు సంఘం జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. హేమలత మాట్లాడుతూ..జిల్లాలో రైతాంగం అనేక సమస్యలు ఎదుర్కొంటోందని వరి అధికంగా పండే తూర్పు మండలాల్లో గిట్టుబాటు ధర లేక రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారని దళారీలే ధరలు నిర్ణయిస్తున్నారని వాపోయారు. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం లేదని ఉన్నా అవి మిల్లర్లకు దళారీగా వ్యవహరిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. నకిలీ విత్తనాల కారణంగా సూళ్ళూరు పేట మండలంలో 350 ఎకరాల్లో రైతులు పంట నష్టపోతే ప్రభుత్వం కనీసం పరిహారం అందించలేదని ఆవేదన వ్యక్తపరిచారు. ఇంకా పరిష్కారం కాని రైతాంగ సమస్యలు ఎన్నో ఉన్నాయనీ, వాటిన్నంటినీ మహ సభల్లో చర్చించి ఉద్యమ ప్రణాళికను సిద్ధం చేయనున్నట్లు తెలిపారు. మాజీ జిల్లా కార్యదర్శి అంగేరి పుల్లయ్య, రంగయ్య, మణి తదితరులు పాల్గొన్నారు.

